ఇప్పటి తరంలో శివరాజ్ కుమార్, రాజ్ కపూర్, డాక్టర్ రాజ్ కుమార్ లాంటోళ్ళు గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటారు కానీ బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన రాజ్ కుమార్ గురించి కూడా తెలుసుకోవాలి. వందేళ్ల క్రితం బలూచిస్తాన్ లో ఉండే కశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించిన ఈయన ఎస్ఐగా పని చేస్తున్న టైంలో 1952 ‘రంగేళి’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. అయిదేళ్ల తర్వాత నర్గిస్ తీసిన ‘మదర్ ఇండియా’ రాజ్ కుమార్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వక్త్, పైగామ్, దిల్ ఏక్ మందిర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ స్టార్ ని చేసింది.
రాజ్ కుమార్ ముక్కుసూటిగా ఉండేవారు. ఏదైనా మొహం మీద చెప్పేయడం, కోపం వస్తే అణుచుకోకపోవడం ఆయన శైలి. పైగామ్ సినిమాలోని ఒక సన్నివేశంలో సహ నటుడు దిలీప్ కుమార్ తన చెంప మీద గట్టిగా కొట్టాడని ఆగ్రహించిన రాజ్ కుమార్ ఏకంగా ముప్పై సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి నటించనని శపథం చేసి అదే మాట మీద నిలబడ్డారు. 1993లో దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ అతి కష్టం మీద ఒప్పించాక సౌదాగర్ లో చేతులు కలిపారు. అంత మొండిపట్టు ఆయనది. ఎదురుగా ఉన్నది అమితాబ్ బచ్చన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా మనసులో ఉన్నది కొట్టినట్టు చెప్పడం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి.
వందలోపే సినిమాల్లో నటించినప్పటికీ రాజ్ కుమార్ ఏనాడూ వేషాల కోసం వెంపర్లాడలేదు. ఎక్కువ నటించాలని తాపత్రయపడలేదు. చనిపోయాక సెలబ్రిటీల అంతిమ యాత్రలా తనకు హడావిడి చేయకూడదని ముందే కోరుకోవడంతో 1996లో ఆయన చివరి శ్వాస తీసుకున్నాక కుటుంబ సభ్యులు బయటి ప్రపంచానికి అది తెలియనివ్వకుండా సైలెంట్ గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తర్వాత మీడియాకు, పరిశ్రమకు చెప్పారు. బుల్లెట్లు వదిలినట్టు డైలాగులు చెబుతున్నారని పేరున్న రాజ్ కుమార్ చివరి వరకు ఆ బ్రాండ్ ని అలాగే నిలబెట్టుకున్నారు. ఆయన శతజయంతి వేళ అభిమానులకు గుర్తొచ్చే జ్ఞాపకాలు ఎన్నో.
This post was last modified on October 8, 2025 10:23 am
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…