Political News

లోకేష్ అంటేనే.. వ‌ణికి పోతున్నారే..!

అవును.. నిజ‌మే. వైసీపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సింహ స్వ‌ప్నంగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఇద్దరు నాయ‌కులు క‌లిసినా నారా లోకేష్ గురించే చ‌ర్చిస్తున్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రెడ్‌బుక్‌పైనా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పై కూడా.. నాయ‌కులు చ‌ర్చిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రెడ్ బుక్‌లో రాసుకుంటాన‌ని, వారి సంగ‌తి చూస్తామ‌ని నారా లోకేష్ త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు, కొంద‌రు అధికారులు ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ రెడ్ బుక్ ప‌ని ప్రారంభించింది.

అప్పుడు కానీ.. వైసీపీ నాయ‌కుల‌కు రెడ్‌బుక్ దూకుడు, ప్రాధాన్యం.. వంటివి తెలిసి రాలేదు. అరెస్టు, జైళ్లు, కేసుల‌తో ఒక ద‌శలో వైసీపీ నాయ‌కులు ఉక్కిరిబిక్కిరికి లోన‌య్యారు. అంతేకాదు.. కొంద‌రు నాయ‌కులు ఇత‌ర ప్రాంతాల‌కు కూడా వెళ్లిపోయారు. ఇక‌, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం క‌మిటీని వేసింది. సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టులు పెట్టేవారిని.. అవ‌మానించేవారిని.. అదేవిధంగా దూషించేవారిని క‌ట్ట‌డి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే సోష‌ల్ మీడియాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. దీనిపై అధ్య‌య‌నం చేసేందుకు మంత్రి లోకేష్ నేతృత్వంలో క‌మిటీని నియ‌మించారు.

అయితే.. ఈ క‌మిటీ ఇంకా ప‌ని కూడా ప్రారంభించ‌కుండానే వైసీపీలో దీనిపై చ‌ర్చ సాగుతోంది. “రెడ్‌బుక్‌ను మించిన స్థాయి లోనే సోష‌ల్ మీడియాపై లోకేష్ దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది” అని టీడీపీ నాయ‌కులు కొంద‌రు ఇటీవ‌ల చెప్పారు. దీంతో వైసీపీలో మ‌రింత‌గా టెన్ష‌న్ పెరిగిపోయింది. ఇదే విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తూ.. అంత‌ర్గ‌త చ‌ర్చ చేస్తున్నారు. రెడ్ బుక్ వ‌స్తేనే.. ఇబ్బందులు ప‌డ్డామ‌ని.. ఇప్పుడు సోష‌ల్ మీడియాను కట్ట‌డి చేసేలా.. లోకేష్ మాస్ట‌ర్ ప్లాన్ చేస్తే.. అప్పుడు మ‌రిన్ని చిక్కులు త‌ప్ప‌వ‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అందుకే.. ఈ వ్య‌వ‌హారంపై మెజారిటీ నాయ‌కులు క‌ల‌వ‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌ట్ట‌డి ఖాయం..!
ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా చూసినా.. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌ను, పోస్టుల‌ను కూడా క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. తొలినాళ్ల‌లో కేంద్రం త‌ర‌హాలోనే చ‌ట్టం చేయాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాక‌పోవ‌డంతో ఇప్పుడు ప్లేట్ మార్చుకుని.. మంత్రుల‌తో క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ సాధ్య‌మైనంత త‌ర్వ‌లోనే నివేదిక ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనిని తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేసేలా హోంశాఖ‌కు జీవో ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. చ‌ట్టం చేయ‌క‌పోయినా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించేలా వారిపై ఒత్తిడి చేసే అవ‌కాశం ఉంది. అందుకే వైసీపీ నాయ‌కుల‌కు నారా లోకేష్ దీనిలో ఏ ప్ర‌తిపాద‌న‌లు చేస్తార‌న్న బెంగ ప‌ట్టుకుంది.

This post was last modified on October 7, 2025 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

6 minutes ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

1 hour ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

1 hour ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago