Political News

ఆటో డ్రైవర్ల సేవలో..భారమైనా మోస్తాం: పవన్

విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలు చేసేందుకు 436 కోట్ల రూపాయల భారం ఖజానాపై పడుతుందని, అయినా సరే బాధ్యతతో ఆ భారాన్ని సంతోషంగా భరిస్తూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు చిన్నపాటి ఊతమిచ్చినా చాలని తాము భావించామని చెప్పారు. అర్హులైన వారికి ఏటా 15 వేలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న గ్రీన్ ట్యాక్స్ సమస్యను, రోడ్లపై గుంతల సమస్యను పరిష్కరించామని చెప్పారు.

స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశామని అన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని, తమ పరిస్థితి ఏంటని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తారని చర్చించామని అన్నారు. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్స్ గురించి హామీ ఇచ్చారని, కచ్చితంగా వారికి న్యాయం చేద్దామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 వేల రూపాయలు ఇస్తున్నామని, అందుకోసం సీఎం చంద్రబాబుకి ఆటో డ్రైవర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వంటి సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పాలన ఇలా ఉంటుందని చెప్పారు.

ఎన్నికలకు ముందు పిఠాపురం పర్యటనలో ఆటోలో ప్రయాణించినపుడు ప్రత్యేకంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ పథకం అమలు భారమని, అయినా సరే ఆనందంగా దాన్ని మోస్తామని పవన్ వెల్లడించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.

This post was last modified on October 4, 2025 9:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan Kalyan

Recent Posts

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

6 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

30 minutes ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

1 hour ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

6 hours ago