Political News

అమరావతి పై మలేషియా చూపు

మలేషియా దేశానికి చెందిన 12 మంది ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు మలేషియాలో పర్యటించిన సందర్భంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. దీంతో మలేషియా ప్రభుత్వం 12 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది.

అమరావతిలో పర్యటిస్తున్న మలేషియా బృందం ఇక్కడ నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలను చూసి విస్మయం వ్యక్తం చేసింది. పనులు నిరంతరాయంగా సాగుతున్నాయని, రాజధాని తొలి దశను 2027 చివరి నాటికి పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ కె. కన్నబాబు వారికి వివరించారు. ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పురోగతి, జరుగుతున్న నిర్మాణాలు, రైతులు ఇచ్చిన భూములు, ప్రతిగా ప్రభుత్వం వారికి కల్పిస్తున్న సదుపాయాలను కూడా వివరించారు.

ఆయా పనులపై మలేషియా ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల భవన సముదాయాలను నిశితంగా పరిశీలించిన మలేషియా బృందం నిర్మాణ రీతులు, డిజైన్‌ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని, రెసిడెన్షియల్ భవనాల పురోగతిని కూడా పరిశీలించింది. అనంతరం ఈ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలతో భేటీ కానుందని సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. వీరు పెట్టే పెట్టుబడులపై త్వరలోనే స్పష్టత వస్తుందని వివరించారు.

This post was last modified on October 4, 2025 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

1 hour ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

2 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago