గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే.. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. నిజానికి పార్టీల తరఫున ఆయా అభ్యర్థులు లేదా సెకండ్ గ్రేడ్ నాయకులు ప్రచారం చేస్తే.. సరిపోతుంది. కానీ, ఇప్పుడు అన్నిపార్టీల నుంచి అతిరథ మహారథులు రంగంలోకి దిగిపోయారు. భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇంత సీన్ ఈ ఎన్నికలకు ఉందా? లేక నాయకులు క్రియేట్ చేశారా? దీనికి ముందు.. 2017లో జరిగిన బృహన్ ముంబై.. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గుర్తు చేసుకోవాలి. ఆ ఎన్నికలు కూడా అన్ని పక్షాలకు ప్రధానమే!
కానీ, కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుని.. పార్టీ అధినేతలు, అతిరథ మహారథులు దూరంగా ఉన్నారు. కేవలం ద్వితీయ శ్రేణి నాయకులకు శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలు బాధ్యతలను అప్పగించాయి. కానీ, ఇప్పుడు హైదరాబాద్లో మాత్రం దీనికి భిన్నంగా పెద్దలే రంగంలోకి దిగేస్తుండడం.. సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ. కామెంట్లు కుమ్మరిస్తుండడం.. వంటి పరిస్థితులను గమనిస్తే.. గ్రేటర్ ఎన్నికలా.. గ్రేటర్ సార్వత్రిక ఎన్నికలా? అనే చర్చ వస్తోంది. మరీ ముఖ్యంగా.. బీజేపీ తరఫున ప్రచారంలో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. సరే.. ఈయన స్థానికుడు కనుక సరిపెట్టుకోవచ్చు.
కానీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా గ్రేటర్లో ప్రచారానికి వస్తున్నారనే అంశమే.. మేధావులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేయడం మంచిదే. కానీ, వాటికి కూడా స్థాయి.. అనేది ఉంటుంది కదా? ప్రధాని అంతటి నాయకుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? అనేది బీజేపీలోని ఓ వర్గంలో వస్తున్న ప్రశ్న. అదేసమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఇదంతా చూస్తే.. బీజేపీ స్థానిక నేతలపై నమ్మకం లేదనైనా అనుకోవాలి? లేదా.. బీజేపీ ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే విమర్శలు అబద్ధమైనా కావాలి! కేసీఆర్ బలంగా ఉండబట్టే.. ఇంత మంది రంగంలోకి దిగుతున్నారని అనుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. బీజేపీ వ్యూహం.. రేపు ఫలించకపోతే.. అడ్డంగా దొరికిపోయేది మోడీనే! మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 27, 2020 8:40 am
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…