Political News

సినీ వివాదాల‌తో చ‌లికాచుకుంటున్న వైసీపీ!

సినీ వివాదాలతో రాజకీయాలు చేయాలని భావిస్తున్న వైసీపీ ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేస్తూ ప్రజల ముందు బలహీనపడుతోందనే వాదన వినిపిస్తోంది. సినీ పరిశ్రమను, రాజకీయాలను విడదీయలేని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. సినీ రంగానికి చెందిన అనేక మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చి పదవుల్లో కొనసాగుతున్నారు. ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ హీరో అన్న విషయం తెలిసిందే. అదే విధంగా టిడిపిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నటసింహంగా పేరు తెచ్చుకున్నారు.

అయితే అప్పుడప్పుడూ కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వివాదాలు తెరమీదకు వచ్చిన ప్రతిసారి అవి ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. తద్వారా వారు రచ్చచేసి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇలాంటి చిన్నపాటి వివాదాలను పెద్దవి చేస్తూ లాభం పొందాలని చూస్తోందన్నది తెలిసిందే.

గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను పెద్దవి చేసి, టిడిపికి మరియు జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య మరింత దూరం పెంచాలని ప్రయత్నాలు చేశారు. అయితే అవి విఫలమయ్యాయి. ఆ వివాదంపై జూనియర్ సైలెంట్‌గా ఉండగా, మరోవైపు చంద్రబాబు సదరు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ వివాదం ముగిసిపోయింది.

‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో కూడా వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. మెగా కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య విభేదాలు రేపే ప్రయత్నం జరిగిందన్న చర్చ ఉంది. ఆ సమయంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. దీనిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకొని, అల్లు అరవింద్ కుటుంబానికి పవన్ కళ్యాణ్‌కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ప్రచారం చేసింది. కానీ అవి కూడా సక్సెస్ కాలేదు.

ఇక ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మీడియా గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చిరంజీవిని బాలకృష్ణ దూషించారని అయినా ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని, అటు సీఎం చంద్రబాబు గాని పట్టించుకోలేదని, బాలకృష్ణను పిలిచి మాట్లాడలేదని, అదే సమయంలో చిరంజీవిని కనీసం ఓదార్చలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి అదే సమయంలో బాలకృష్ణ జగన్‌ను కూడా సైకో అంటూ దూషించారు.

దీనిపై పెద్దగా స్పందించని వైసీపీ నాయకులు, చిరంజీవిని తిట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కాపు వర్గ నాయకులు తల్లడిల్లుతున్నారని వార్తలు రాస్తున్నారు. అంటే సినీ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను రాజకీయంగా తమకు ఉపయోగించుకొని చిరంజీవిని తమ వర్గంలోకి మార్చుకోవాలని వైసీపీ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇరుపక్షాలు సంయమనం పాటిస్తుండడంతో వైసీపీకి అవకాశం దొరకడం లేదు.

This post was last modified on September 30, 2025 6:25 pm

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

48 seconds ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

13 minutes ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

17 minutes ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

37 minutes ago

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

59 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago