ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్లకు.. ఏడాదికి రూ.15000 ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 4 నుంచి ఈ పథ కాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే విడుదల చేసినట్టు చె ప్పారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని.. ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కూడా తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే సుపరిపాలన లక్ష్యమని చెప్పారు.
ఎందుకీ పథకం?
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు.. ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చారు. వీటిలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆయన ప్రతిపాదించారు. దీనిని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు. అయితే.. ఆర్టీసీలో ఉచితప్రయాణం కారణంగా.. ఇప్పటి వరకు ఆటోలు, ట్యాక్సీలలో ప్రయాణించే మహిళలు.. కుటుంబాలు(ఎందుకంటే ఒక కుటుంబంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో వస్తే.. ఇతర సభ్యులు విడిగా రారు కదా!) ఆటోలు ఎక్కే అవకాశం ఉండదని.. దీంతో తమ ఉపాధిపై ప్రభావం పడుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఎవరూ కోరకుండానే సీఎం చంద్రబాబు తొలినాళ్లలోనే ఆటోవాలాలకు ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాద నపై దృష్టి పెట్టారు. తొలుత ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని అనుకున్నారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకున్న సమాచారం, నివేదికల ఆధారంగా ఈ సొమ్మును రూ.15 వేలకు పెంచారు. ఇదే విషయాన్ని ఆగస్టు 15న ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించే సమయంలోనే ఎనౌన్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి అసెంబ్లీలోను.. తర్వాత మీడియా ముందు కూడా సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే నెల 4 నుంచి ఆటోవాలాలకు.. రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఇవీ.. నిబంధనలు..
1) ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద ఏటా రూ.15 వేలు పొందాలనుకునే వారికి ఆర్టీఏ అధికారులు ఇచ్చే లైసెన్సు ఉండాలి.
2) లైసెన్సుతోపాటు.. బ్యాడ్జ్(లైట్ మోటర్ వెహికల్) ఉండాలి.
3) సొంత ఆటో ఉండాలి.
4) అద్దె దారులు అయితే.. దానికి సంబంధించి యజమాని ఇచ్చే సర్టిఫికెట్(నోటరీ) సమర్పించాలి.
5) వయసు 60 ఏళ్లు మించరాదు.
6) పురుషులు, మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
7) ఒకే విడతలో రూ.15000 చొప్పున బ్యాంకులో జమచేస్తారు.
8) పర్యావరణ పరిరక్షణ నిధి కింద రూ.2000లను మినహాయించుకోనున్నారు.(దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.)
This post was last modified on September 28, 2025 10:56 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…