తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తాను చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కీలకమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కారు ఏకంగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం రేపో, మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న కాంగ్రెస్ శ్రేణులు, బీసీలు సంతోషంలో మునిగిపోయారు.
వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రేవంత్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కుల గణన తర్వాత రాష్ట్రంలో బీసీలు 42 శాతం ఉన్నారని, ఆ దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ ఘనంగా ప్రకటించారు. ఆ ప్రతిపాదనను ఆయన గవర్నర్ కార్యాలయానికి పంపారు. అయితే గవర్నర్ ఆ బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపారు. ప్రస్తతం సదరు బిల్లు రాష్ట్రపతి భవన్ లోనే మూలుగుతోంది.
అయితే ఓ వైపు హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటం, మరోవైపు పార్టీ శ్రేణుల నుంచి ఎన్నికల నిర్వహణ కోసం ఒత్తిడి పెరగడంతో రేవంత్ చివరాఖరుకు కదలక తప్పలేదు. సరే తాము పంపిన బిల్లు రాష్ట్రపతి భవన్ లో పెండింగ్ లో ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించిన రేవంత్… తమ ప్రభుత్వమే ధైర్యం చేసి మరీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా జీవోలను జారీ చేసింది.
This post was last modified on September 27, 2025 8:23 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…