Political News

చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల‌కు చాలా న‌మ్మ‌కం ఉంది: ఉప‌రాష్ట్ర‌ప‌తి

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చంద్ర‌బాబుపై ఏపీ ప్ర‌జ‌ల‌కు చాలా న‌మ్మ‌కం ఉంద‌ని.. ఆయ‌న విజ‌న్‌ప‌ట్ల ఎంతో మందికి మ‌క్కువ ఉంద‌ని అన్నారు. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఈ నెల 9న ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న సీపీ రాధాకృష్ణ‌న్‌.. తొలిసారి బుధ‌వారం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రి నారా లోకేష్ ఆయ‌న‌కు విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. తొలుత సాయంత్రం ఆయ‌న ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దుర్గమ్మ బుధ‌వారం అన్న‌పూర్ణాదేవి అలంకారంలో ద‌ర్శ‌మిచ్చింది. ఆమెను కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి.. ఆనందం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం.. విజ‌య‌వాడలోని భ‌వానీ ఘాట్‌కు చేరుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి దంప‌తులు.. ఇక్క‌డ జ‌రుగుతున్న `విజ‌య‌వాడ ఉత్స‌వ్‌`ను తిల‌కించారు. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఏపీ ప్ర‌జ‌లు చంద్రబాబుపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డంతోపాటు పెట్టుబడులు కూడాసాధిస్తార‌ని విశ్వ‌సిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కం మేర‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న‌ను అందిస్తోంద‌న్నారు. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రానికి ఎంతో భ‌విష్య‌త్తు ఉంద‌ని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకువెళ్తోంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా అభివృద్ధి చెందుతుంద‌న్నారు.

ఇక‌, విజ‌య‌వాడ న‌గ‌రంపైనా ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌లుకీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ రాష్ట్రం దేశానికే అన్న‌పూర్ణ‌గా ఉంద‌న్న ఆయ‌న‌.. విజ‌య‌వాడ రాష్ట్ర అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని తెలిపారు. ఎటు చూసినా.. ప‌చ్చ‌ని అందాలు క‌నిపించాయ‌ని తెలిపారు. ప‌క్క‌నే కృష్ణాన‌ది ఉండ‌డం మ‌రింత‌శోభాయ‌మానంగా ఉంద‌న్నారు. అయితే.. విజ‌య‌వాడ హాట్ సిటీ అని చ‌మ‌త్క‌రించారు. వేస‌విలో ఇక్క‌డ భారీ ఎండ‌లు ఉంటాయ‌ని.. చెప్పారు. కానీ, ఇక్క‌డిప్ర‌జ‌లు మాత్రం చాలా కూల్‌గా ఉంటార‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు విజ‌న్‌తో రాష్ట్రం విక‌సిత్ ఏపీగా మార‌నుంద‌న్నారు. ఇక్క‌డి వారి సంప్ర‌దాయాలు చాలా గొప్ప‌వ‌ని తెలిపారు.

తిరుమ‌ల‌కు..

విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న అనంత‌రం.. ఉప‌రాష్ట్ర‌ప‌తి తిరుప‌తికి వెళ్లారు. తిరుమ‌ల‌లో బుధ‌వారం రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్స‌వాల్లో సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఆయ‌న పాల్గొంటారు. శ్రీవారి వాహ‌న సేవ‌ల్లోనూ ఆయ‌న పాల్గొంటారు. కాగా.. తొలిసారి రాష్ట్రానికి వ‌చ్చిన రాధాకృష్ణ‌న్‌కు ప‌లువురు నాయ‌కులు.. అభినంద‌న‌లు తెలిపారు. ముఖ్యంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వానం మేర‌కు.. తాను వ‌చ్చాన‌ని రాధాకృష్ణ‌న్‌ చెప్ప‌డంతో ఆయ‌న పొంగిపోయారు.

This post was last modified on September 24, 2025 8:14 pm

Share

Recent Posts

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

2 hours ago

కెన్యా విషయంలో జాగ్రత్తలు అవసరం

కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…

2 hours ago

విశ్వనాథ్ గెలిస్తే క్రెడిట్ తెలుగు ప్రేక్షకులదే

కోలీవుడ్ స్టార్ సూర్య సుడి బాగుంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ గజిని హీరోకి…

3 hours ago

ఇరుముడికి ఎలాంటి ఇరుకు లేదు

ఆగస్ట్ 21 ఇరుముడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ…

5 hours ago

బొమ్మరిల్లు హాసిని… విశ్వనాథ్ మ్యాడీ

వరల్డ్ బిల్డింగులు, ఎలివేషన్లు, గ్యాంగ్ స్టర్ డ్రామాలు నిండిపోయిన ట్రెండ్ లో హీరోల డామినేషన్ తోనే కథలు రాస్తున్న దర్శకులు…

5 hours ago

అప్పుడు ప్రభాస్‌… ఇప్పుడు యష్!

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…

9 hours ago