Political News

కేఏ పాల్‌పై కేసు.. ఏం జ‌రిగింది?

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కిలారి ఆనంద‌పాల్‌(కేఏ పాల్‌)పై హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌ను పాల్ లైంగికంగా వేధించారంటూ.. ఓ యువ‌తి ఫిర్యా దు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేసి, మాన‌సికంగా వేధించార‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే ఫిర్యా దు చేసిన యువ‌తి విదేశాల‌కు చెందిన వ్య‌క్తిగా చెప్పారు.

పాల్‌కు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అమెరికా కో ఆర్డినేట‌ర్‌గా ఓ యువ‌తి పాల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి న‌ప్పుడు.. త‌నను తాకుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు ఆరోపించారు. త‌న భుజంపై చేయి వేసి.. ఇత‌రుల ముందు మాట్లాడుతున్నార‌ని కూడా ఆమె పేర్కొన్నారు. తాను ఇటీవ‌ల కాలంలోనే ఆయ‌న ద‌గ్గర కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేయ‌డం ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

పాల్ చేష్ఠ‌ల‌తో మానసికంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు కూడా యువ‌తి తెలిపారు. అదేస‌మ‌యంలో పార్టీలో చేరాల‌ని.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని కూడా ఒత్తిడి తెస్తున్న‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ వేధింపుల‌పై పాల్ ను విచారించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రోవైపు పాల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసుపై కానీ, ఆ యువ‌తి ఫిర్యాదుపై కానీ స్పందించ‌క‌పోవ‌డం గమ‌నార్హం. ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని పాల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా ఆయ‌న‌పై కేసు పెట్టించార‌న్న వాద‌న ప్ర‌జాశాంతి పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తుండ‌డం ఆశ్చ‌ర్యక‌రంగా మారింది.

This post was last modified on September 21, 2025 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago