Political News

కేఏ పాల్‌పై కేసు.. ఏం జ‌రిగింది?

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కిలారి ఆనంద‌పాల్‌(కేఏ పాల్‌)పై హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌ను పాల్ లైంగికంగా వేధించారంటూ.. ఓ యువ‌తి ఫిర్యా దు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేసి, మాన‌సికంగా వేధించార‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే ఫిర్యా దు చేసిన యువ‌తి విదేశాల‌కు చెందిన వ్య‌క్తిగా చెప్పారు.

పాల్‌కు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అమెరికా కో ఆర్డినేట‌ర్‌గా ఓ యువ‌తి పాల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి న‌ప్పుడు.. త‌నను తాకుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు ఆరోపించారు. త‌న భుజంపై చేయి వేసి.. ఇత‌రుల ముందు మాట్లాడుతున్నార‌ని కూడా ఆమె పేర్కొన్నారు. తాను ఇటీవ‌ల కాలంలోనే ఆయ‌న ద‌గ్గర కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేయ‌డం ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

పాల్ చేష్ఠ‌ల‌తో మానసికంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు కూడా యువ‌తి తెలిపారు. అదేస‌మ‌యంలో పార్టీలో చేరాల‌ని.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని కూడా ఒత్తిడి తెస్తున్న‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ వేధింపుల‌పై పాల్ ను విచారించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రోవైపు పాల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసుపై కానీ, ఆ యువ‌తి ఫిర్యాదుపై కానీ స్పందించ‌క‌పోవ‌డం గమ‌నార్హం. ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని పాల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా ఆయ‌న‌పై కేసు పెట్టించార‌న్న వాద‌న ప్ర‌జాశాంతి పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తుండ‌డం ఆశ్చ‌ర్యక‌రంగా మారింది.

This post was last modified on September 21, 2025 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago