ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కిలారి ఆనందపాల్(కేఏ పాల్)పై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పాల్ లైంగికంగా వేధించారంటూ.. ఓ యువతి ఫిర్యా దు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు.. తనను రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేసి, మానసికంగా వేధించారని కూడా ఆమె చెప్పినట్టు తెలిపారు. అయితే ఫిర్యా దు చేసిన యువతి విదేశాలకు చెందిన వ్యక్తిగా చెప్పారు.
పాల్కు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికా కో ఆర్డినేటర్గా ఓ యువతి పాల్ దగ్గర పనిచేస్తున్నారు. అయితే.. ఇటీవల కాలంలో మీడియా సమావేశాలు నిర్వహించి నప్పుడు.. తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు. తన భుజంపై చేయి వేసి.. ఇతరుల ముందు మాట్లాడుతున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. తాను ఇటీవల కాలంలోనే ఆయన దగ్గర కోఆర్డినేటర్గా పనిచేయడం ప్రారంభించినట్టు తెలిపారు.
పాల్ చేష్ఠలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా యువతి తెలిపారు. అదేసమయంలో పార్టీలో చేరాలని.. పార్టీ తరఫున ప్రచారం చేయాలని కూడా ఒత్తిడి తెస్తున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఈ వేధింపులపై పాల్ ను విచారించనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు పాల్ ఇప్పటి వరకు ఈ కేసుపై కానీ, ఆ యువతి ఫిర్యాదుపై కానీ స్పందించకపోవడం గమనార్హం. ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఉద్దేశ పూర్వకంగా ఆయనపై కేసు పెట్టించారన్న వాదన ప్రజాశాంతి పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తుండడం ఆశ్చర్యకరంగా మారింది.
This post was last modified on September 21, 2025 2:37 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…