Political News

మా పార్టీ.. పుష్ప‌క విమానం: చంద్ర‌బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీ గిరి గీసుకుని కూర్చోద‌ని అన్నారు. “ఇది ప్ర‌జ‌ల పార్టీ. ప్ర‌జ‌ల కోసం పెట్టిన పార్టీ.. పుట్టిన పార్టీ.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది పుష్ప‌క విమానం. ఎంత మంది వ‌చ్చినా.. మ‌రొక‌రికి చోటు ఉంటుంది. రాష్ట్రంలో సుప‌రిపాల‌న‌ను చూసి చాలా మంది చేరుతామ‌ని ముందుకు వ‌స్తున్నారు. అంద‌రికీ ఒక్క‌టే చెబుతున్నా.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకునేవారు ఎవ‌రైనా రావొచ్చు. వ్య‌క్తిగ‌త స్వార్థానికి.. సంపాద‌న‌కు పార్టీలో చోటు ఉండ‌దు. ప్ర‌జ‌ల కోసం ఎంత మంది వ‌చ్చినా.. చోటు ఉంటుంది.“ అని పిలుపునిచ్చారు.

తాజాగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీలో చేరారు. అమ‌రావ‌తి ప‌రిధిలోని ఉండ‌వ‌ల్లిలో ఉన్న ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వైసీపీకి రాజీనామా చేసిన క‌ర్రి ప‌ద్మ‌శ్రీ(తూర్పు గోదావ‌రి), మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌(సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే, చిల‌క‌లూరిపేట‌), బ‌ల్లి క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి(గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున ఎంపీ, ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్న బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ త‌న‌యుడు)లు.. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. వారిని సీఎం చంద్ర‌బాబు సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. గ‌తానికి బిన్నంగా తాజాగా పార్టీలో చేరేందుకు ముందుకు వ‌చ్చిన వారితో ఆయ‌న 10 నిమిషాల చొప్పున చ‌ర్చించారు.

వారు ఎందుకు పార్టీ మారారు? భ‌విష్య‌త్తులో ఏం కోరుకుంటున్నారు? ప్ర‌జ‌ల‌తో వారికి ఉన్న అనుబంధం? అదేవిధంగా పార్టీకి చేసే కంట్రిబ్యూష‌న్‌? వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం వారి నుంచి ప్ర‌భుత్వ పాల‌న‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో వివ‌రంగా తెలుసుకున్నారు. అనంత‌రం.. వారికి పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌తంలో పార్టీలోకి ఎవ‌రినీ తీసుకోకూడ‌ద‌ని అనుకున్నామ‌ని..కానీ, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చే వారి విష‌యంలో ఆంక్ష‌లు పెట్ట‌డం స‌రికాద‌ని భావించి నిర్ణ‌యం మార్చుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేవారు ఎవ‌రైనా ముందుకు రావ‌చ్చ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త‌మ పార్టీ పుష్ప‌క విమాన‌మ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 20, 2025 9:26 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

6 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

6 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

7 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

9 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

9 hours ago

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

10 hours ago