తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి ఓ సంచలన వార్త.. మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ పాలనా కాలంలో జరిగినట్టు ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు పేర్కొంటున్న లిక్కర్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారనేది వార్త సారాంశం. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. అంటే.. దీనిని బట్టి.. వైసీపీ హయాంలో జరిగినట్టు సర్కారు చెబుతున్న మద్యం కుంభకోణం కేసు విచారణకు ఈడీకి అప్పగించారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి దీనిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా.. సీబీఐ, ఈడీలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎక్కడా ప్రకటించలేదు. మరి అనూహ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్టు చెబుతున్న లిక్కర్ కుంభకోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయడం ఏంటనేది చర్చ. అయితే.. దీనిపై ఇటు ప్రభుత్వం కానీ.. అటు కేంద్ర దర్యాప్తు సంస్థకానీ.. ఎక్కడా స్పందించలేదు. కనీసం పన్నెత్తు మాట కూడా అనలేదు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ విషయంపై మౌనంగానే ఉన్నారు.
మరోవైపు.. ఈడీ మాత్రం రెండు ప్రధాన లిక్కర్ కేసులను దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంతోపాటు.. ఛత్తీస్గడ్లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భగల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కుంభకోణం.. ఈ రెండు కేసులను ఈడీ విచారిస్తోంది. భగల్ కుమారుడిని కూడా గత నెలలో అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆ రెండు కేసులకు సంబంధించి న సమాచారం కూపీలాగేందుకు ఈడీ ఈ రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
అలాకాదు.. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణంపైనే విచారణ చేస్తోందని భావిస్తే.. ఖచ్చితంగా అది సీరియస్గా నే మారుతుంది. గతంలో ఈడీ అధికారులు విజయవాడకు వచ్చి.. ఈ కేసులో ఏ1-గా ఉన్న రాజ్ కసిరెడ్డిని విచారించారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అవి పూర్తికాగానే.. మళ్లీ ఈడీ అధికారులు సోదాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదేమైనా.. ప్రస్తుతం జరుగుతున్న సోదాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…