Political News

వైసీపీ లిక్క‌ర్ స్కామ్‌ను ‘ఈడీ’కి అప్ప‌గించారా?

తాజాగా గురువారం మ‌ధ్యాహ్నం నుంచి ఓ సంచ‌ల‌న వార్త‌.. మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ పాల‌నా కాలంలో జ‌రిగిన‌ట్టు ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం, అధికారులు పేర్కొంటున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నార‌నేది వార్త సారాంశం. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఢిల్లీల‌లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు సర్కారు చెబుతున్న మ‌ద్యం కుంభ‌కోణం కేసు విచార‌ణ‌కు ఈడీకి అప్ప‌గించారా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

వాస్త‌వానికి దీనిపై ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. పైగా.. సీబీఐ, ఈడీలు కూడా ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి అనూహ్యంగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై ఈడీ అధికారులు ద‌ర్యాప్తు చేయ‌డం ఏంట‌నేది చ‌ర్చ‌. అయితే.. దీనిపై ఇటు ప్ర‌భుత్వం కానీ.. అటు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కానీ.. ఎక్క‌డా స్పందించ‌లేదు. క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ విష‌యంపై మౌనంగానే ఉన్నారు.

మ‌రోవైపు.. ఈడీ మాత్రం రెండు ప్ర‌ధాన లిక్క‌ర్ కేసుల‌ను ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌టి ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంతోపాటు.. ఛ‌త్తీస్‌గ‌డ్‌లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భ‌గ‌ల్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చోటు చేసుకున్న కుంభ‌కోణం.. ఈ రెండు కేసుల‌ను ఈడీ విచారిస్తోంది. భ‌గ‌ల్ కుమారుడిని కూడా గ‌త నెల‌లో అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో ఆ రెండు కేసుల‌కు సంబంధించి న స‌మాచారం కూపీలాగేందుకు ఈడీ ఈ రాష్ట్రాల్లో ద‌ర్యాప్తు చేస్తోంద‌న్న అనుమానాలు కూడా ఉన్నాయి.

అలాకాదు.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కుంభ‌కోణంపైనే విచార‌ణ చేస్తోంద‌ని భావిస్తే.. ఖ‌చ్చితంగా అది సీరియ‌స్‌గా నే మారుతుంది. గ‌తంలో ఈడీ అధికారులు విజ‌య‌వాడకు వ‌చ్చి.. ఈ కేసులో ఏ1-గా ఉన్న రాజ్ క‌సిరెడ్డిని విచారించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. త‌ర్వాత ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు వ‌చ్చాయి. అవి పూర్తికాగానే.. మ‌ళ్లీ ఈడీ అధికారులు సోదాలు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సోదాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Satya

Recent Posts

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

37 seconds ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

3 hours ago

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

12 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

12 hours ago

నిషేధం చిన్న చ‌ర్యే: టెలిగ్రామ్ యాప్‌కు కోర్టు షాక్‌!

త‌మ‌పై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాల‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌పై నిషేధం విధించింద‌ని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును…

13 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

14 hours ago