Political News

వైసీపీ లిక్క‌ర్ స్కామ్‌ను ‘ఈడీ’కి అప్ప‌గించారా?

తాజాగా గురువారం మ‌ధ్యాహ్నం నుంచి ఓ సంచ‌ల‌న వార్త‌.. మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ పాల‌నా కాలంలో జ‌రిగిన‌ట్టు ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం, అధికారులు పేర్కొంటున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నార‌నేది వార్త సారాంశం. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఢిల్లీల‌లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు సర్కారు చెబుతున్న మ‌ద్యం కుంభ‌కోణం కేసు విచార‌ణ‌కు ఈడీకి అప్ప‌గించారా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

వాస్త‌వానికి దీనిపై ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. పైగా.. సీబీఐ, ఈడీలు కూడా ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి అనూహ్యంగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై ఈడీ అధికారులు ద‌ర్యాప్తు చేయ‌డం ఏంట‌నేది చ‌ర్చ‌. అయితే.. దీనిపై ఇటు ప్ర‌భుత్వం కానీ.. అటు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కానీ.. ఎక్క‌డా స్పందించ‌లేదు. క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ విష‌యంపై మౌనంగానే ఉన్నారు.

మ‌రోవైపు.. ఈడీ మాత్రం రెండు ప్ర‌ధాన లిక్క‌ర్ కేసుల‌ను ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌టి ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంతోపాటు.. ఛ‌త్తీస్‌గ‌డ్‌లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భ‌గ‌ల్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చోటు చేసుకున్న కుంభ‌కోణం.. ఈ రెండు కేసుల‌ను ఈడీ విచారిస్తోంది. భ‌గ‌ల్ కుమారుడిని కూడా గ‌త నెల‌లో అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో ఆ రెండు కేసుల‌కు సంబంధించి న స‌మాచారం కూపీలాగేందుకు ఈడీ ఈ రాష్ట్రాల్లో ద‌ర్యాప్తు చేస్తోంద‌న్న అనుమానాలు కూడా ఉన్నాయి.

అలాకాదు.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కుంభ‌కోణంపైనే విచార‌ణ చేస్తోంద‌ని భావిస్తే.. ఖ‌చ్చితంగా అది సీరియ‌స్‌గా నే మారుతుంది. గ‌తంలో ఈడీ అధికారులు విజ‌య‌వాడకు వ‌చ్చి.. ఈ కేసులో ఏ1-గా ఉన్న రాజ్ క‌సిరెడ్డిని విచారించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. త‌ర్వాత ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు వ‌చ్చాయి. అవి పూర్తికాగానే.. మ‌ళ్లీ ఈడీ అధికారులు సోదాలు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సోదాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

This post was last modified on September 18, 2025 9:48 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

21 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

31 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

48 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago