భారత ఎన్నికల వ్యవస్థలో ఓటర్లకు మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలు కూడా ముద్రించనుంది. బిహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్లు సులభంగా తమ అభ్యర్థిని గుర్తించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి ముఖచిత్రం మూడొంతుల స్థలాన్ని ఆక్రమించేలా ముద్రించనున్నారు. అలాగే అభ్యర్థుల సీరియల్ నంబర్లను పెద్ద ఫాంట్ సైజ్లో బోల్డ్ అక్షరాలతో ముద్రిస్తారు. పేర్లు మాత్రమే కాకుండా, “నోటా” ఆప్షన్కూ ఇదే విధానం అనుసరించనున్నారు.
గత ఆరు నెలల కాలంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సౌలభ్యం కోసం ఈసీ 28 మార్పులు చేసినట్లు తెలిపింది. వాటిలో ఈ తాజా నిర్ణయం ముఖ్యమైనదిగా నిలిచింది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, అభ్యర్థులను సులభంగా గుర్తించడానికి కలర్ ఫోటో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
బిహార్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు వేగవంతమయ్యాయి. 243 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటరు జాబితా సవరించబడుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసీ తీసుకున్న కొత్త నిర్ణయం బిహార్లోనే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు కూడా వర్తించనుంది.
మొత్తం మీద, ఈవీఎంలలో కలర్ ఫోటోలు ముద్రించడం చదువుకోలేని ఓటర్లకు పెద్ద సహాయంగా మారబోతోంది. అభ్యర్థుల గుర్తింపు విషయంలో గందరగోళం తొలగిపోవడంతోపాటు పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. బిహార్ ఎన్నికలతో ప్రారంభమయ్యే ఈ నిబంధన తర్వాతి అన్ని రాష్ట్రాలు, జాతీయ స్థాయి ఎన్నికల్లో అమలవుతుందన్నది ఖాయం.
This post was last modified on September 17, 2025 8:32 pm
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…
కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
ఈ వారం మంచి అంచనాల మధ్య రిలీజైన సినిమా.. చెన్నై లవ్ స్టోరీ. ఐతే ప్రి రిలీజ్ బజ్ ఎంత…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…