వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన.. తిరుమల, తిరుపతిని ఆధారంగా చేసుకుని సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఇచ్చే సమయంలో జరిగిన తొక్కిసలాట, తర్వాత.. గోవుల మరణాలు.. అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగులు.. ఇలా అనేక అంశాలను భూమన ప్రస్తావించారు. అదేసమయంలో తిరుపతిలో స్వామి కొండకు ఆనుకుని స్టార్ హోటళ్లకు.. భూములు ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలా.. అనేక రూపాల్లో ఆయన ఉద్యమించారు.
తాజాగా కూడా మరో వివాదాన్ని భూమన తెరమీదికి తెచ్చారు. శ్రీమహావిష్ణు విగ్రహాన్ని రోడ్డుపై పడేశారని ఆయన చేసిన విమర్శ.. సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో వైరల్ అయింది. అయితే.. దీనిపై టీటీడీ బోర్డు సహా.. స్థానిక నాయకులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. మహావిష్ణువు విగ్రహానికి,శనేశ్వరుని విగ్రహానికి తేడా తెలియకుండా టిటిడి చైర్మన్ గా రెండు పర్యాయాలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలా పనిచేశారో అర్థం కావడంలేదని దుయ్యబడుతున్నారు. అంతేకాదు.. కేవలం తన రాజకీయ ఉనికి కోసం దిగజారిపోయి మీడియాలో కనిపించాలన్న ఆత్రంతో శ్రీవారిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తిరుమలను ప్రపంచం మొత్తం చూస్తూ ఉందన్న కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడడం దారుణమని భాను ప్రకాష్ రెడ్డి సహా పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నుంచి భూమనకు మాత్రం మద్దతు లభించడం లేదు. ఆయనకు అనుకూలంగా ఒక్క నాయకుడు కూడా నోరు పెగల్చకపోవడం గమనార్హం. కొన్నాళ్ల కిందట ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా.. వైసీపీలో భూమన గురించి.. ఎవరూ పట్టించుకోలేదు.
అంటే. దీనిని బట్టి.. భూమన ఒంటరి అయ్యారా? పార్టీ ఆయనకు ప్రాధాన్యం తగ్గించిందా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. వాస్తవానికి భూమన తిరుపతి సహా జిల్లాలో బలమైన రెడ్డి నాయకుడిగా ఎదిగారు. గత ఎన్నికలలో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ, ఆయన ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి పార్టీలో భూమనకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందన్న చర్చ ఉంది. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా.. మౌనంగా నే ఉంటున్నారు. మరోవైపు.. టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగాయని.. వీటిపై విచారణ చేపట్టాలని కూడా కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భూమనకు ఇంటా బయటా కూడా మద్దతు లభించకపోవడం గమనార్హం.
This post was last modified on September 17, 2025 3:59 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…