Political News

వైసీపీలో భూమ‌న ఒంట‌రి పోరాటం.. !

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆయ‌న.. తిరుమ‌ల, తిరుప‌తిని ఆధారంగా చేసుకుని స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. గ‌తంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి టోకెన్లు ఇచ్చే స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిసలాట‌, త‌ర్వాత‌.. గోవుల మ‌ర‌ణాలు.. అన్య‌మ‌త ప్ర‌చారం, అన్య‌మ‌త ఉద్యోగులు.. ఇలా అనేక అంశాల‌ను భూమ‌న ప్ర‌స్తావించారు. అదేస‌మ‌యంలో తిరుప‌తిలో స్వామి కొండ‌కు ఆనుకుని స్టార్ హోట‌ళ్ల‌కు.. భూములు ఇవ్వ‌డాన్ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా.. అనేక రూపాల్లో ఆయ‌న ఉద్య‌మించారు.

తాజాగా కూడా మ‌రో వివాదాన్ని భూమన తెర‌మీదికి తెచ్చారు. శ్రీమహావిష్ణు విగ్రహాన్ని రోడ్డుపై ప‌డేశార‌ని ఆయ‌న చేసిన విమ‌ర్శ‌.. సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర‌స్థాయిలో వైర‌ల్ అయింది. అయితే.. దీనిపై టీటీడీ బోర్డు స‌హా.. స్థానిక నాయ‌కులు ఆయ‌న‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. మ‌హావిష్ణువు విగ్ర‌హానికి,శనేశ్వరుని విగ్రహానికి తేడా తెలియకుండా టిటిడి చైర్మన్ గా రెండు పర్యాయాలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలా పనిచేశారో అర్థం కావడంలేదని దుయ్యబడుతున్నారు. అంతేకాదు.. కేవలం తన రాజ‌కీయ‌ ఉనికి కోసం దిగజారిపోయి మీడియాలో కనిపించాలన్న ఆత్రంతో శ్రీవారిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

తిరుమలను ప్రపంచం మొత్తం చూస్తూ ఉంద‌న్న‌ కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడడం దారుణమని భాను ప్ర‌కాష్ రెడ్డి స‌హా ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. వైసీపీ నుంచి భూమ‌న‌కు మాత్రం మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. ఆయ‌న‌కు అనుకూలంగా ఒక్క నాయ‌కుడు కూడా నోరు పెగ‌ల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కొన్నాళ్ల కింద‌ట ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిని ఉద్దేశించి ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు కూడా.. వైసీపీలో భూమ‌న గురించి.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

అంటే. దీనిని బ‌ట్టి.. భూమ‌న ఒంట‌రి అయ్యారా? పార్టీ ఆయ‌న‌కు ప్రాధాన్యం త‌గ్గించిందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి భూమ‌న తిరుప‌తి స‌హా జిల్లాలో బ‌ల‌మైన రెడ్డి నాయ‌కుడిగా ఎదిగారు. గ‌త ఎన్నిక‌ల‌లో త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ, ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీలో భూమ‌న‌కు ప్రాధాన్యం త‌గ్గుతూ వ‌చ్చింద‌న్న చ‌ర్చ ఉంది. ఆయ‌న కుమారుడు అభిన‌య్ రెడ్డి కూడా.. మౌనంగా నే ఉంటున్నారు. మ‌రోవైపు.. టీడీఆర్ బాండ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. వీటిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కూడా కూట‌మి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో భూమ‌న‌కు ఇంటా బ‌య‌టా కూడా మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

13 minutes ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

26 minutes ago

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

1 hour ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

1 hour ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

3 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

4 hours ago