వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన.. తిరుమల, తిరుపతిని ఆధారంగా చేసుకుని సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఇచ్చే సమయంలో జరిగిన తొక్కిసలాట, తర్వాత.. గోవుల మరణాలు.. అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగులు.. ఇలా అనేక అంశాలను భూమన ప్రస్తావించారు. అదేసమయంలో తిరుపతిలో స్వామి కొండకు ఆనుకుని స్టార్ హోటళ్లకు.. భూములు ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలా.. అనేక రూపాల్లో ఆయన ఉద్యమించారు.
తాజాగా కూడా మరో వివాదాన్ని భూమన తెరమీదికి తెచ్చారు. శ్రీమహావిష్ణు విగ్రహాన్ని రోడ్డుపై పడేశారని ఆయన చేసిన విమర్శ.. సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో వైరల్ అయింది. అయితే.. దీనిపై టీటీడీ బోర్డు సహా.. స్థానిక నాయకులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. మహావిష్ణువు విగ్రహానికి,శనేశ్వరుని విగ్రహానికి తేడా తెలియకుండా టిటిడి చైర్మన్ గా రెండు పర్యాయాలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలా పనిచేశారో అర్థం కావడంలేదని దుయ్యబడుతున్నారు. అంతేకాదు.. కేవలం తన రాజకీయ ఉనికి కోసం దిగజారిపోయి మీడియాలో కనిపించాలన్న ఆత్రంతో శ్రీవారిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తిరుమలను ప్రపంచం మొత్తం చూస్తూ ఉందన్న కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడడం దారుణమని భాను ప్రకాష్ రెడ్డి సహా పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నుంచి భూమనకు మాత్రం మద్దతు లభించడం లేదు. ఆయనకు అనుకూలంగా ఒక్క నాయకుడు కూడా నోరు పెగల్చకపోవడం గమనార్హం. కొన్నాళ్ల కిందట ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా.. వైసీపీలో భూమన గురించి.. ఎవరూ పట్టించుకోలేదు.
అంటే. దీనిని బట్టి.. భూమన ఒంటరి అయ్యారా? పార్టీ ఆయనకు ప్రాధాన్యం తగ్గించిందా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. వాస్తవానికి భూమన తిరుపతి సహా జిల్లాలో బలమైన రెడ్డి నాయకుడిగా ఎదిగారు. గత ఎన్నికలలో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ, ఆయన ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి పార్టీలో భూమనకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందన్న చర్చ ఉంది. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా.. మౌనంగా నే ఉంటున్నారు. మరోవైపు.. టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగాయని.. వీటిపై విచారణ చేపట్టాలని కూడా కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భూమనకు ఇంటా బయటా కూడా మద్దతు లభించకపోవడం గమనార్హం.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…