కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కుస్తీలు ఓ రేంజ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. స్థానికంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రెడ్డప్ప గారి మాధవి పై టిడిపి సహా బిజెపి, జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తను తీసుకున్న నిర్ణయమే సరైనదిగా భావిస్తున్నారని గతంలోని టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అధికారులను కూడా తిట్టడం అదేవిధంగా కౌన్సిల్ లోను తనకు సీటు ఇవ్వలేదని అలిగి యాగి చేయడం వంటివి చర్చకు దరి తీశాయి.
ఆ తర్వాత కూడా ఆమె పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదని అంటున్నారు. ఇక పార్టీ విషయాలు కూడా తమకు చెప్పకుండా చేస్తున్నారని, కనీసం జిల్లాలో ఉన్న కీలక నాయకులకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నది టిడిపి నాయకులు గత నుంచి చెబుతున్న మాట. ఇక ఇప్పుడు ఈ పరంపరలో బిజెపి, జనసేన నాయకులు కూడా చేరారు. వాస్తవానికి కడపలో జనసేన పెద్దగా లేదు. కానీ, బిజెపి కొంత హవా చాలా ఇస్తోంది. ఆదినారాయణ రెడ్డి వర్గం నుంచి కొంత మంది నాయకులు జిల్లాలో ప్రభావం చూపిస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే మాధవి వ్యవహారంపై వారు నిప్పులు చెరుగుతుండడం విశేషం. కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని, తాము కూటమిలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని వారు చెబుతున్నారు. తాము ఏ పని మీద వెళ్లినా.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని తాజాగా బిజెపి నాయకులు విమర్శలు గుర్తించారు. ఇక జనసేన నాయకులు ఉన్న చోట కూడా మాధవి పనులు చేయించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికి రాజకీయంగా కూటమి నాయకుల మధ్య సఖ్యత ఉండాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వస్తున్న విషయం తెలిసిందే. అందరూ కలిసికట్టుగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటారని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా బీజేపీ అగ్రనాయకులు చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో ఇతర జిల్లాల కంటే కూడా కడపలో ఈ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై వస్తున్న ఈ విమర్శలను ఆమె సీరియస్గా తీసుకుంటారా లేక ఇవన్నీ తనపై జరుగుతున్న కుట్రని కొట్టి పారేస్తారానేది చూడాలి. ఏది ఏమైనా కడప నియోజకవర్గంలో మాధవి వ్యవహార శైలిపై మాత్రం సొంత పార్టీ నుంచి కూటమి పార్టీల వరకు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…