కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కుస్తీలు ఓ రేంజ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. స్థానికంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రెడ్డప్ప గారి మాధవి పై టిడిపి సహా బిజెపి, జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తను తీసుకున్న నిర్ణయమే సరైనదిగా భావిస్తున్నారని గతంలోని టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అధికారులను కూడా తిట్టడం అదేవిధంగా కౌన్సిల్ లోను తనకు సీటు ఇవ్వలేదని అలిగి యాగి చేయడం వంటివి చర్చకు దరి తీశాయి.
ఆ తర్వాత కూడా ఆమె పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదని అంటున్నారు. ఇక పార్టీ విషయాలు కూడా తమకు చెప్పకుండా చేస్తున్నారని, కనీసం జిల్లాలో ఉన్న కీలక నాయకులకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నది టిడిపి నాయకులు గత నుంచి చెబుతున్న మాట. ఇక ఇప్పుడు ఈ పరంపరలో బిజెపి, జనసేన నాయకులు కూడా చేరారు. వాస్తవానికి కడపలో జనసేన పెద్దగా లేదు. కానీ, బిజెపి కొంత హవా చాలా ఇస్తోంది. ఆదినారాయణ రెడ్డి వర్గం నుంచి కొంత మంది నాయకులు జిల్లాలో ప్రభావం చూపిస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే మాధవి వ్యవహారంపై వారు నిప్పులు చెరుగుతుండడం విశేషం. కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని, తాము కూటమిలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని వారు చెబుతున్నారు. తాము ఏ పని మీద వెళ్లినా.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని తాజాగా బిజెపి నాయకులు విమర్శలు గుర్తించారు. ఇక జనసేన నాయకులు ఉన్న చోట కూడా మాధవి పనులు చేయించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికి రాజకీయంగా కూటమి నాయకుల మధ్య సఖ్యత ఉండాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వస్తున్న విషయం తెలిసిందే. అందరూ కలిసికట్టుగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటారని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా బీజేపీ అగ్రనాయకులు చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో ఇతర జిల్లాల కంటే కూడా కడపలో ఈ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై వస్తున్న ఈ విమర్శలను ఆమె సీరియస్గా తీసుకుంటారా లేక ఇవన్నీ తనపై జరుగుతున్న కుట్రని కొట్టి పారేస్తారానేది చూడాలి. ఏది ఏమైనా కడప నియోజకవర్గంలో మాధవి వ్యవహార శైలిపై మాత్రం సొంత పార్టీ నుంచి కూటమి పార్టీల వరకు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…