జిల్లాలు అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు రోజుల పాటు అమరావతిలోని సచివాలయంలో నిర్వహించి కలెక్టర్ల సదస్సు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలపై మరోసారి కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాల అభివృద్ధికి ఇప్పటికే రోడ్ మ్యాప్ను రెడీ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఓ పది సూత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన వాటిని కలెక్టర్లు పాటించాలని అన్నారు. వాటిని ఫాలో అయితే.. జిల్లాలు డెవలప్ అవుతాయని.. తద్వారా రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పారు.
ప్రధానంగా పెట్టుబడులకు పెద్దపీట వేయాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. యువతలో నైపుణ్యాన్నిపెంచాలన్నారు. పర్వావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. అదేసమయంలో ఉద్యోగ, ఉపాధికల్పనకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్స హించాలని సూచించారు. ప్రతి పనినీ మనసు పెట్టిచేయాలని.. కృతకంగా చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. అధికారులు.. ప్రజలకు మధ్య గ్యాప్ పెరగకుండా చూడాలన్నారు. అదేసమయంలో ప్రజాప్రతినిధుల వినతులను కూడా పట్టించుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ఇవన్నీ.. పాటిస్తే.. జిల్లా అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదన్నారు.
వృద్ధిపై దృష్టి
జిల్లా అభివృద్ధి చెందాలంటే.. ఆదాయం కూడా బాగుండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం 12.02 శాతంగా ఉన్న వృద్ధిని వచ్చే ఏడాది కల్లా 15 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇస్తున్న ఇతర పథకాలతో కలిపి మొత్తం ఏడాదికి 76 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. గతేడాది 12.02 శాతం వృద్ధి సాధించామన్న ఆయన.. వచ్చే ఏడాది 15 శాతం లక్ష్యంతో ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు. అయితే.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుందన్న చంద్రబాబు.. మరికొన్ని వెనుకబడ్డాయని లిస్టు చదివి వినిపించారు.
ఉపాధి కల్పనకు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుందని .. దానిని వినియోగించుకుని జిల్లాల్లో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు. “ఒక కుటుంబం.. ఒక వ్యాపారవేత్త నినాదం“ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా మారాలని సూచించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని తెలిపారు. రిసోర్సులను చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఏం చేస్తున్నా.. ఎలా ఉన్నా.. పది సూత్రాలను మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. సౌర విద్యుత్తుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల ఆర్థిక స్థాయిలోనూ మార్పులు తీసుకురావాలని సూచించారు.
This post was last modified on September 17, 2025 7:49 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…