Political News

ఈ ఫొటో జూబ్లీహిల్స్ ఓటర్లను షేక్ చేసింది!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ.. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో అక్కడి ఓటర్లను, రాజకీయ విశ్లేషకులను షేక్ చేసింది. అంతగా ఆ ఫొటోలో ఏముందన్న విషయానికి వెళితే… బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ కీలక నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు.

ఈ ఫొటో చూసినంతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జాగృతి కూడా పోటీ చేయబోతోందని, తన అభ్యర్థిగా విష్ణును నిలుపుతున్నారని, ఈ మేరకే కవిత పిలుపుతో ఆమె ఇంటికి విష్ణు వెళ్లారని పుకార్లు పుట్టాయి. ఈ పుకార్లు కాస్తా చాలా వేగంగా జూబ్లీహిల్స్ వ్యాప్తంగా పాకిపోయాయి. ఇక రాజకీయ విశ్లేషకులు అయితే జాగృతికి బలమైన అభ్యర్థి లభించారని భావించారు. అదే సమయంలో విష్ణు ఎంట్రీ ఇస్తే ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు కాంగ్రెస్ పార్టీలకు ఉప ఎన్నికలో విజయం సాదించడం కష్టమేనని కూడా విశ్లేషించారు.

ప్రస్తుతం విష్ణు బీఆర్ఎస్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన సమయంలో తొలిసారి జరిగిన ఎన్నికలో నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విష్ణు విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో దివంగత మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మరో రెండు పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అయితే ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైన ఆయన మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇక విష్ణు విషయానికి వస్తే తన సోదరి విజయతో విభేదాల నేపథ్యంలో అటు జూబ్లీహిల్స్, ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గాలపై పట్టు కోల్పోయారు. అంతేకాకుండా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలోనూ విష్ణుకు టికెట్ లభించడం లేదు. దీంతోనే ఆయన కవితను ఆశ్రయించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన విష్ణు… తాను బీఆర్ఎస్ ను వీడేది లేదని, కేటీఆర్ వెంటే నడుస్తానని, కేటీఆర్ తో పాటు తనకూ ప్రమోషన్ ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అసలు విషయం ఏమిటంటే… కవిత, విష్ణుల భేటీ అసలు రాజకీయ ప్రాధాన్యమైనదే కాదట. దసరా పండుగ దగ్గర పడుతోంది కదా. పండుగ వేళ పీజేఆర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరేందుకే కవిత ఇంటికి విష్ణు వెళ్లారట. ఆ ఫొటోలో కూడా పెద్దమ్మ గుడి ఉత్సవాల ఆహ్వాన పత్రికను విష్ణు… కవితకు అందించి ఉత్సవాల గురించి వివరిస్తున్నారట. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్న జనం ఏమీ లేకుండానే ఇంతోటి ప్రచారం అవసరమా? అంటూ నొసలు చిట్లించారు.

This post was last modified on September 16, 2025 1:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

7 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

9 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

9 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

12 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

13 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

13 hours ago