బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు గతంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అవసరం లేకుండానే.. నిర్వహణ కంపెనీకి నిధులు మంజూరు చేశారని.. ఈ విషయంలో అప్పటి మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్కు ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ సహా.. అప్పటి అధికారులు.. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించారు. అదేవిధంగా దిగువ శ్రేణి సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు.
అయితే.. అప్పట్లో ఈ కేసుపై కేటీఆర్.. తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాజకీయ కుట్రతో తనను ఇబ్బంది పెట్టాలని చేస్తున్న కేసు గా ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఆనాటి విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు తాజాగా తమ నివేదికను ప్రభుత్వానికి అందించారు. సుమారు 1000 పేజీలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. దీనిలో ప్రధానంగా కేటీఆర్ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏ-2గా, అప్పటి హైదరాబాద్ మెట్రో అభివృద్ధి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిని ఏ-3గా పేర్కొన్నారు. మొత్తంగా వీరి ప్రమేయాన్ని కూలంకుషంగా నివేదికలో వివరించారని తెలుస్తోంది.
10 కోట్ల రూపాయలు..
ఈ-ఫార్ములా రేస్ కేసులో మొత్తంగా 10 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. విదేశీ కంపెనీలకు.. ఈ సొమ్మును అనవసరంగా కట్టబెట్టారని, దీనిలో అప్పటి మంత్రి కేటీఆర్కు కొంత సొమ్ము ముట్టిందన్నది కూడా ప్రధాన ఆరోపణ. ఇదిలావుంటే.. తాజాగా ఇచ్చిన ఏసీబీ నివేదికలో విచారణకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సర్కారుకు వదిలి పెట్టారు. ప్రభుత్వం కనుక దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తదుపరి విచారణతోపాటు.. కోర్టులో చార్జిషీట్లను కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇది కేటీఆర్కు మరింత ఇబ్బంది కలిగించే అంశమని అంటున్నారు. ఒకవైపు కేసీఆర్, హరీష్రావులపై కాళేశ్వరం కేసు వెంటాడుతుండగా.. కేటీఆర్కు పోన్ ట్యాపింగ్ సహా ఈ ఫార్ములా రేస్ కేసు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి.
This post was last modified on September 10, 2025 10:06 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…