Political News

కేటీఆర్‌కు ఉచ్చు.. ఏసీబీ నివేదిక రెడీ!

బీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రిగిన ఫార్ములా ఈ-రేస్ వ్య‌వ‌హారంలో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు గ‌తంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. అవ‌స‌రం లేకుండానే.. నిర్వ‌హ‌ణ కంపెనీకి నిధులు మంజూరు చేశార‌ని.. ఈ విష‌యంలో అప్ప‌టి మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌కు ప్ర‌మేయం ఉంద‌ని కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాగానే.. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీకి అప్ప‌గించారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ స‌హా.. అప్ప‌టి అధికారులు.. అర‌వింద్ కుమార్‌, బీఎల్ఎన్ రెడ్డిల‌ను కూడా విచారించారు. అదేవిధంగా దిగువ శ్రేణి సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు.

అయితే.. అప్ప‌ట్లో ఈ కేసుపై కేటీఆర్‌.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇది రాజ‌కీయ కుట్ర‌తో త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని చేస్తున్న కేసు గా ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఆనాటి విచార‌ణ‌కు సంబంధించి ఏసీబీ అధికారులు తాజాగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించారు. సుమారు 1000 పేజీల‌తో కూడిన నివేదిక‌ను ఉన్న‌తాధికారుల‌కు అందించారు. దీనిలో ప్ర‌ధానంగా కేటీఆర్‌ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్‌ను ఏ-2గా, అప్ప‌టి హైద‌రాబాద్ మెట్రో అభివృద్ధి ప్రాజెక్టు చీఫ్ ఇంజ‌నీర్ బీఎల్ ఎన్ రెడ్డిని ఏ-3గా పేర్కొన్నారు. మొత్తంగా వీరి ప్ర‌మేయాన్ని కూలంకుషంగా నివేదిక‌లో వివ‌రించార‌ని తెలుస్తోంది.

10 కోట్ల రూపాయ‌లు..

ఈ-ఫార్ములా రేస్ కేసులో మొత్తంగా 10 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అయింద‌న్న‌ది ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌. విదేశీ కంపెనీల‌కు.. ఈ సొమ్మును అన‌వ‌స‌రంగా క‌ట్ట‌బెట్టార‌ని, దీనిలో అప్ప‌టి మంత్రి కేటీఆర్‌కు కొంత సొమ్ము ముట్టింద‌న్న‌ది కూడా ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇదిలావుంటే.. తాజాగా ఇచ్చిన ఏసీబీ నివేదిక‌లో విచార‌ణ‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాన్ని స‌ర్కారుకు వ‌దిలి పెట్టారు. ప్ర‌భుత్వం క‌నుక దీనిపై గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. త‌దుప‌రి విచార‌ణ‌తోపాటు.. కోర్టులో చార్జిషీట్ల‌ను కూడా దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది. దీంతో ఇది కేటీఆర్‌కు మ‌రింత ఇబ్బంది క‌లిగించే అంశ‌మ‌ని అంటున్నారు. ఒక‌వైపు కేసీఆర్‌, హ‌రీష్‌రావుల‌పై కాళేశ్వ‌రం కేసు వెంటాడుతుండ‌గా.. కేటీఆర్‌కు పోన్ ట్యాపింగ్ స‌హా ఈ ఫార్ములా రేస్ కేసు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

57 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago