Political News

‘సూప‌ర్ సిక్స్‌’కు జీఎస్టీ దెబ్బ‌.. !

జీఎస్టీ తగ్గింపు ప్రభావం రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు దీని ప్రభావం పడుతుంది? అనేది ఆర్థిక శాఖలో చర్చిగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా పన్నులపై ఆధారపడి పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి ఆర్థికంగా ప్రభుత్వానికి తీవ్ర భారం అయినటువంటి పథకాలు.

అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వీటిని అమలు చేస్తున్నారు. ఇంకా మరో రెండు కీలక పథకాలు అమలు కావలసినవి ఉన్నాయి. వాటిని పక్కన పెట్టినా.. ప్రస్తుతం అమలు జరుగుతున్న వాటిని గమనిస్తే ఏటా 4 వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు అయ్యే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఏటా 12 వేల కోట్ల రూపాయలు అంచనాతో ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకం, అదేవిధంగా ఏటా 18 నుంచి 22 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అన్నదాత సుఖీభవ వంటివి సర్కారుకు పెద్ద ఆర్థిక భారం అనే చెప్పాలి.

ఇటువంటివి అమలు చేయాలి అంటే కచ్చితంగా రాష్ట్రానికి రాబడి ముఖ్యం. ‘సంపద సృష్టి’ అంటే ఒకవైపు పరిశ్రమలు మరోవైపు అభివృద్ధి వంటివి జరిగినా.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి కీలకం. ఇటువంటి సమయంలో జీఎస్టీ లో శ్లాబులను మార్చడం ద్వారా పన్ను రేట్లు తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సహజంగానే ఆదాయం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పుంజుకుంటుంది.. అనేది ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చగా మారింది.

దీంతో భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై ప్రభావం పడుతుందనేది అధికారులు చెబుతున్న మాట. దీనిని అధిగమించేందుకు ఇతర వ్యూహాలతో ముందుకు సాగాలి.. ఆదాయం పెంపుపై ఎటువంటి విధానాలను అనుసరించాలి.. అనేది ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. సహజంగా జిఎస్టిలో రెండు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఒకటి నేరుగా జీఎస్టీ లో వచ్చే ప‌న్నుల‌ ఆదాయం. దీంతో పాటు కేంద్రం నుంచి జిఎస్టి రూపంలో వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది.

ఇప్పుడు శ్లాబును తగ్గించడం ద్వారా సహజంగానే పన్ను ఆదాయం తగ్గిపోతుంది. ఇటు రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పాటు అటు కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఆధారపడి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుంటుపడే అవకాశం ఉంటుందన్నది ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. మరి దీని నుంచి అధిగమించేందుకు సంపాదన సృష్టించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనేది చూడాలి.

This post was last modified on September 9, 2025 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

56 minutes ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

2 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

3 hours ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

3 hours ago

లడ్డూ అంశంపై అసెంబ్లీలో పవన్ చర్చ?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…

3 hours ago

జక్కన్నా… నువు అసాధ్యుడివయ్యా!

ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్‌…

4 hours ago