Political News

మ‌ద్యం స్కామ్‌లో సంచ‌ల‌నం.. ‘వారంద‌రికీ’ బెయిల్‌!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌భుత్వం చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో మొత్తం 3500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారాయ‌ని, దారి మ‌ళ్లాయ‌ని, విదేశాల‌కు సైతం పంపించార‌ని ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే 14 మందిని అరెస్టు చేశారు. వీరంతా హైప్రొఫైల్ ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ప‌రిణామాల‌తో ఈ కేసు దాదాపు యూట‌ర్న్ తీసుకుందన్న చ‌ర్చ సాగుతోంది. స‌రైన సాక్ష్యాలు లేవ‌న్న కార‌ణంతో ముగ్గురు కీలక నిందితులు(సిట్ పేర్కొన్న మేర‌కు) తాజాగా బెయిల్ మంజూరైంది.

వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్‌రెడ్డి, జ‌గ‌న్ ద‌గ్గ‌ర గ‌తంలో ఓఎస్‌డీగా ప‌నిచేసిన కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ లో ఆడిట‌ర్‌గా ప‌నిచేస్తున్న బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. వీరంతా మే 13 నుంచి జైల్లోనే ఉన్నారు. దీనికి ముందే వారు .. కోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా.. అప్ప‌ట్లో స‌క్సెస్ కాలేదు. తాజాగా గ‌త నెల‌లో సిట్ దాఖ‌లు చేసిన చార్జ్ షీట్‌లో స‌రైన వివ‌రాలు లేవ‌ని, లోపాలు ఉన్నాయ‌ని ఏసీబీ కోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో ఇటీవ‌ల రివైజ్డ్ చార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. దీనిలోనూ లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తాజాగా వెల్ల‌డించింది.

ఈ క్ర‌మంలోనే నిందితులుగా ఉన్న ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువ రించింది. కాగా.. ఇది మ‌ధ్యంత‌ర బెయిల్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా నిందితుల‌పై స‌రైన సాక్ష్యాలు, ఆధారాలు సేక‌రించ‌లేద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే వారికి బెయిల్ ఇస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఒక్క విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌లు త‌ప్ప వారికి ఎలాంటి ష‌ర‌తులు విధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో పై ముగ్గురు సోమ‌వారం లేదా ఆదివారం విజ‌య‌వాడ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు.. ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న‌కు ప‌లు ష‌ర‌తులు విధించింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్ర‌మే బెయిల్ ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. కాగా.. ఒకే రోజు ఇలా న‌లుగురు కీల‌క నిందితుల‌కు బెయిల్ రావ‌డంతో ఈ కేసుపై చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు.. ఇప్ప‌టికే జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పిటిష‌న్ కూడా సోమ‌వారం మ‌రోసారి విచార‌ణ‌కు రానుంది. ఇంత మందికి బెయిల్ ల‌భించిన నేప‌థ్యంలో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డికి కూడా బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని.. న్యాయ‌వాదులు చెబుతున్నారు. మొత్తంగా ఈ కేసు ఎలాంటి మ‌లుపుతిరుగుతుంద‌న్న‌ది చూడాలి.

This post was last modified on September 6, 2025 9:52 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

2 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

3 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

4 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

5 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

9 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

10 hours ago