సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని, కాళేశ్వరం అవినీతి అంటూ కేసీఆర్ పై సీబీఐ విచారణకు పురిగొల్పారని ఆరోపించారు. అందుకే, హరీష్ రావు పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించడం లేదని, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ ను మాత్రమే రేవంత్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కవిత కామెంట్లకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను హరీష్, సంతోష్ ల వెనుక లేనని, చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని రేవంత్ ఘాటుగా బదులిచ్చారు.
కవిత వెనుక తానున్నానని కొందరంటున్నారని, ఆమె మాత్రం హరీష్ వెనుక తానున్నానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నేను ఎవరి వెనుక లేనని, మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దంటూ కవితకు హితవు పలికారు. 1000 రూపాయల నోటు మాదిరిగానే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోబోతోందని జోస్యం చెప్పారు. గతంలో ఇతరులను ఎదగనీయని వారు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వాళ్లను వాళ్లే పొడుచుకుంటున్నారని అన్నారు. అవినీతి సొమ్ము పంచుకునే క్రమంలో గొడవలు వచ్చాయని, కుటుంబ పంచాయతీలలలోకి తనను లాగొద్దని అన్నారు.
చేసిన పాపాలు ఎక్కడకీ పోవని, వాళ్లు అనుభవించి తీరాల్సిందేనని చెప్పారు. తాను నాయకుడినని, తన వారి ముందుంటానని అన్నారు. మీరంతా దిక్కుమాలిన వారని, తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని, అటువంటి వారి వెనుక ఎవరుంటారని అన్నారు. తాను పాలమూరు జిల్లా ప్రజలు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటానని అన్నారు. తనకు కేసీఆర్ కుటుంబ, కుల పంచాయతీలు తీర్చే సమయం, ఆసక్తి లేదని అన్నారు. అందులోకి దయచేసి తనను లాగొద్దని అన్నారు.
This post was last modified on September 3, 2025 3:15 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…