Political News

లాక్ డౌన్ ఉల్లంఘన..ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై పిల్

కరోనాను కట్టడి చేసే ఏకైక ఉద్దేశంతోనే కఠినంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 1.0 సత్ఫలితాలనివ్వడంతో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిరోధించేందుకు లాక్ డౌన్ 2.0ని విధించక తప్పలేదు.

లాక్ డౌన్ సమయంలో బయట తిరగకూడదని…సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం, పోలీసులు మొత్తుకుంటున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా ప్రతినిధులు కూడా కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయితే, ఏపీలో మాత్రం కొందరు ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

లాక్ డౌన్ వేళ నలుగురికి చెప్పాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు….స్వతహాగా నిబంధనలు పాటించడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సదరు ఎమ్మెల్యేలు సమావేశాలు, సభలు, కార్యక్రమాల పేరుతో లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కారని లాయర్ కిషోర్ పిల్ దాఖలు చేశారు.

పలువురు వై‌సీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ వైపు కరోనా కట్టడి కోసం ప్రజలంతా లాక్ డౌన్ ను కచ్చితంగా పాటిస్తుంటే మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల పేరుతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని లాయర్ కిషోర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో పాటు నిబంధనలు పాటించ‌ని వైసీపీ నేత‌ల‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల రజినీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను ఈ పిల్‌లో ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానాన్ని కిషోర్ కోరారు.

లాక్‌డౌన్ వేళ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని లాయర్ కిషోర్ ప్ర‌శ్నించారు. కరోనా కట్టడి కోసం అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్ాన…కొంద‌రు అధికార దుర్వినియోగానికి పాల్పడి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కిషోర్ పేర్కొన్నారు.

This post was last modified on May 1, 2020 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

19 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago