ఏపీలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించి సుప్రీంకోర్టు చిత్రమైన తీర్పు ఇచ్చింది. గతంలో దేనినైతే కోర్టు తప్పుబట్టిందో, ప్రస్తుతం మళ్లీ అదే విషయాన్ని సమర్థించడం గమనార్హం. అందుకే తాజాగా ఆదేశాలను న్యాయవాదులు, న్యాయవర్గాలు కూడా చిత్రమైన తీర్పుగా పేర్కొంటున్నారు. అంతేకాదు, ఆమె పేర్కొన్న వారికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
విషయం ఏంటంటే
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె గతంలో జైలులో కూడా గడిపి వచ్చారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని, తాను కేవలం సంతకమే చేశానని ఆమె పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ (వైఎస్) విధాన పరమైన నిర్ణయం మేరకే తాను సంతకం చేశానని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసు నుంచి తన పేరును తీసేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన కోర్టు చివరకు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆమె పేరును నిందితుల జాబితా నుంచి తొలగించింది. అయితే ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేశారు. దీంతో అప్పటి హైకోర్టు తీర్పుపై మండిపడిన సుప్రీంకోర్టు ఈ కేసును మరోసారి విచారించాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు మళ్లీ ఈ కేసును విచారించి, నిందితుల జాబితాలో శ్రీలక్ష్మి పేరును చేరుస్తున్నట్టు పేర్కొంది.
అంతేకాదు, సీబీఐ విచారణకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామంతో షాకైన శ్రీలక్ష్మి తాజా హైకోర్టు తీర్పుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పేరును తొలగించాలని కోరారు. లేదా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని అభ్యర్థించారు.
దీనిని శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు శ్రీలక్ష్మిని నిందితురాలిగా పేర్కొంటూ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పినట్టే హైకోర్టు చేయగా, ఇప్పుడు మళ్లీ శ్రీలక్ష్మికి ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, స్టే విధించడం చిత్రంగా ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…