Political News

లోకేశ్ గుడ్ న్యూస్… ఉత్సవ మండపాలకు ప్రీ పవర్

అసలే ఇది పండుగల సీజన్. ముందు వినాయక చవితి. ఆ తర్వాత దసరా. ఇలా యావత్తు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ పండుగల కోలాహలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో గణేశ్ ఉత్సవ సమితులు, వినాయక మండపాల నిర్వాహకులు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ద్వారా వారు ఈ వినతిని ప్రభుత్వానికి పంపారు. ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్న లోకేశ్… గణేశ్ ఉత్సవ సమితిలతో పాటు దసరా సందర్భంగా ఏర్పాటు అయ్యే దుర్గా మాత మండపాల నిర్వాహకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గణేశ్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు… వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని లోకేశ్ కోరారు. ఈ వినతిని లోకేశ్ నేరుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ల ముందు పెట్టారు. సీఎం, విద్యుత్ శాఖ మంత్రి దీనిపై చర్చించి లోకేశ్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. అనంతరం గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే… వినాయక చవితి ముగిసిన కొన్నాళ్లకే దసరా వేడుకలు కూడా ఉన్నాయి కదా. ఇదే విషయం సీఎం, లోకేశ్, గొట్టిపాటి చర్చల్లో ప్రస్తావనకు రాగా… వినాయక మండపాలకు మాత్రమే ఎందుకు? దసరా సందర్భంగా ఎక్కడికక్కడ వెలిసే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ను అందజేద్దామని వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు వేడుకల మండపాలకు ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పినా… శుభకార్యాల మండపాలకు ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదని సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తంగా గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు అడిగితే… దుర్గామాత భక్తులకూ లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పేశారు.

This post was last modified on August 25, 2025 4:39 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Lokesh

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

16 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

41 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

43 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago