Political News

లోకేశ్ గుడ్ న్యూస్… ఉత్సవ మండపాలకు ప్రీ పవర్

అసలే ఇది పండుగల సీజన్. ముందు వినాయక చవితి. ఆ తర్వాత దసరా. ఇలా యావత్తు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ పండుగల కోలాహలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో గణేశ్ ఉత్సవ సమితులు, వినాయక మండపాల నిర్వాహకులు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ద్వారా వారు ఈ వినతిని ప్రభుత్వానికి పంపారు. ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్న లోకేశ్… గణేశ్ ఉత్సవ సమితిలతో పాటు దసరా సందర్భంగా ఏర్పాటు అయ్యే దుర్గా మాత మండపాల నిర్వాహకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. గణేశ్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు… వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని లోకేశ్ కోరారు. ఈ వినతిని లోకేశ్ నేరుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ల ముందు పెట్టారు. సీఎం, విద్యుత్ శాఖ మంత్రి దీనిపై చర్చించి లోకేశ్ చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. అనంతరం గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే… వినాయక చవితి ముగిసిన కొన్నాళ్లకే దసరా వేడుకలు కూడా ఉన్నాయి కదా. ఇదే విషయం సీఎం, లోకేశ్, గొట్టిపాటి చర్చల్లో ప్రస్తావనకు రాగా… వినాయక మండపాలకు మాత్రమే ఎందుకు? దసరా సందర్భంగా ఎక్కడికక్కడ వెలిసే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ను అందజేద్దామని వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు వేడుకల మండపాలకు ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పినా… శుభకార్యాల మండపాలకు ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదని సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తంగా గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు అడిగితే… దుర్గామాత భక్తులకూ లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పేశారు.

Kumar

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

2 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

2 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago