కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు నలుగురు వైసీపీ తో టచ్లో ఉన్నారు. మరో రాజ్యసభ సభ్యుడు ఏకంగా మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యారు. తనకు ఖర్గేతో 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉందని.. అందుకే కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ అధినేత సదరు నేతను వివరణ కోరినట్టు తెలిసింది. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చిదంబరం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లు వచ్చాయని సమాచారం.
వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని ఆయనను అభ్యర్థించారు. అయితే.. దీనికి వైసీపీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలావుంటే.. అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ నేతల వైఖరిపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేసి నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకులను కూడా ఆయన మందలించినట్టు తెలిసింది. అసలు వారు ఫోన్లు చేస్తే.. మీరెందుకు రిసీవ్ చేసుకున్నారని.. ప్రశ్నించినట్టు సమాచారం.
“నాపై కేసులు పెట్టిన విషయం.. మన పార్టీని ఇరుకున పెట్టేలా.. ఇప్పటికీ షర్మిలతో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియదా. ఎవడో మాణిక్కం ఆయన కూడా మనపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే.. మనం ఎందుకు స్పందించాలి. ఇక, నుంచి ఫోన్లు కూడా తీయొద్దు.” అని సీరియస్ గా చెప్పేశారని.. తాడేపల్లి కార్యాలయానికి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు ఆఫ్దిరికార్డుగా మీడియా మిత్రులకు చెప్పుకొని రావడం గమనార్హం.
ప్రస్తుతం కాంగ్రెస్కు వైసీపీ మద్దతు ఉన్నా.. లేకున్నా.. తటస్థంగా వ్యవహరిస్తే తమకు మేలు జరుగుతుందని చెబుతోంది. “నేరుగా మాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి. అదే మేం కోరుతున్నాం” అని ఖర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయేలో లేని పార్టీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన విన్నవిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో లేదు. తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా మచ్చిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వైసీపీ మాత్రం కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతోంది.
This post was last modified on August 25, 2025 1:02 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…