Political News

రాజ‌కీయం నేర్చుకోవాలి జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను చేస్తున్న రాజ‌కీయం మ‌రెవ‌రూ చేయ‌రు అని అనుకుంటే అంత‌క‌న్నా పొర‌పాటు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు కూడా మారుతున్నారు. పాలను పాల‌లా, నీళ్లను నీళ్ల‌లానే చూస్తున్నారు. దీనిని అవ‌గ‌తం చేసుకుంటేనే రాజ‌కీయాల్లో కొన్నాళ్లు మ‌న‌గ‌లుగుతారు. లేక‌పోతే స‌ర్దేసుకునే ప‌రిస్థితి ఖాయం. ఇప్పుడు ఇదే ఏపీలోనూ జ‌రుగుతోంది. “ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నా రు” అని రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌ర‌చుగా చెబుతుంటారు.

ఇది నిజం కూడా! కానీ ప్ర‌జ‌లు గ‌మ‌నించిన దానికి అనుగుణంగా నాయ‌కులు న‌డుచుకోవాలి. ముఖ్యంగా పార్టీల అధినేత‌లు వ్య‌వ‌హ‌రించాలి. ఈ విష‌యంలోనే జ‌గ‌న్ త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. తాను ప‌ట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్న చందంగా వ్య‌వ‌హ‌రించి న‌ష్ట‌పోయారు. ఇది తెలుసుకుని ప్ర‌జ‌ల నాడిని గుర్తెరిగితేనే త‌ప్ప జ‌గ‌న్‌కు ఫ్యూచ‌ర్ లేదు. ఇది వాస్త‌వం. కానీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌డం లేదు. ప్ర‌జ‌లు ఒక‌ప్పుడు ఉన్న మాన‌సిక స్థితిలోనే ఇప్పుడు ఉన్నార‌న్న వాద‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు.

కానీ ప్ర‌జ‌లు ఎప్పుడో మారారు. పార్టీల‌ను చూడ‌డం లేదు. మంచిని, తమ‌కు ప్ర‌యోజ‌న‌క‌రం అనుకున్న వాటిని మాత్ర‌మే చూస్తున్నారు. అదే గ‌త ఎన్నిక‌ల్లోనూ నిజ‌మైంది. ఒక‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వాలు తెచ్చిన ప‌థ‌కాల‌ను ఎత్తేసినా ప‌రవాలేదనుకున్న ప్ర‌జ‌లు ఇప్పుడు అలా లేరు. ప‌థకం ఏదైనా మంచి ఉంటే, త‌మ‌కు మేలు చేస్తుంద‌ని అనుకుంటే కొన‌సాగించాల‌నే కోరుతున్నారు. కానీ జ‌గ‌న్ అన్నా క్యాంటీన్ వంటి కీల‌క కార్య‌క్ర‌మాన్ని ఎత్తేశారు. ప్ర‌జాభ‌వన్‌ను కూల‌దోశారు. అమ‌రావ‌తిని అట‌కెక్కించారు. ఈ ప‌రిణామం ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ అయింది.

ఇక ఇప్పుడు జ‌రుగుతున్న విష‌యానికి వ‌స్తే, అసెంబ్లీకి జ‌గ‌న్ వెళ్లాల‌ని మెజారిటీ ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇది ప్ర‌త్య‌ర్థులు చెబుతున్న మాట కాదు. ఆన్‌లైన్ ఛానెళ్లు చేస్తున్న స‌ర్వేలు చెబుతున్న మాట‌. జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడాల‌ని కోరుకునే వారు ఎక్కువ‌గా ఉన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని కూడా కోరుతున్నారు. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ల‌కుండా భీష్మించుకుంటున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తే ఏదో జాత‌ర‌లా వ‌స్తున్నారు. ఇది స‌రికాదు. ప్ర‌జ‌ల నాడి తెలుసుకుని వారికి అనుగుణంగా రాజ‌కీయాలు మ‌లుచుకునే దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఎంతైనా ఉంది.

This post was last modified on August 22, 2025 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

53 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago