Political News

రాజ‌కీయం నేర్చుకోవాలి జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను చేస్తున్న రాజ‌కీయం మ‌రెవ‌రూ చేయ‌రు అని అనుకుంటే అంత‌క‌న్నా పొర‌పాటు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు కూడా మారుతున్నారు. పాలను పాల‌లా, నీళ్లను నీళ్ల‌లానే చూస్తున్నారు. దీనిని అవ‌గ‌తం చేసుకుంటేనే రాజ‌కీయాల్లో కొన్నాళ్లు మ‌న‌గ‌లుగుతారు. లేక‌పోతే స‌ర్దేసుకునే ప‌రిస్థితి ఖాయం. ఇప్పుడు ఇదే ఏపీలోనూ జ‌రుగుతోంది. “ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నా రు” అని రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌ర‌చుగా చెబుతుంటారు.

ఇది నిజం కూడా! కానీ ప్ర‌జ‌లు గ‌మ‌నించిన దానికి అనుగుణంగా నాయ‌కులు న‌డుచుకోవాలి. ముఖ్యంగా పార్టీల అధినేత‌లు వ్య‌వ‌హ‌రించాలి. ఈ విష‌యంలోనే జ‌గ‌న్ త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. తాను ప‌ట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్న చందంగా వ్య‌వ‌హ‌రించి న‌ష్ట‌పోయారు. ఇది తెలుసుకుని ప్ర‌జ‌ల నాడిని గుర్తెరిగితేనే త‌ప్ప జ‌గ‌న్‌కు ఫ్యూచ‌ర్ లేదు. ఇది వాస్త‌వం. కానీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌డం లేదు. ప్ర‌జ‌లు ఒక‌ప్పుడు ఉన్న మాన‌సిక స్థితిలోనే ఇప్పుడు ఉన్నార‌న్న వాద‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు.

కానీ ప్ర‌జ‌లు ఎప్పుడో మారారు. పార్టీల‌ను చూడ‌డం లేదు. మంచిని, తమ‌కు ప్ర‌యోజ‌న‌క‌రం అనుకున్న వాటిని మాత్ర‌మే చూస్తున్నారు. అదే గ‌త ఎన్నిక‌ల్లోనూ నిజ‌మైంది. ఒక‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వాలు తెచ్చిన ప‌థ‌కాల‌ను ఎత్తేసినా ప‌రవాలేదనుకున్న ప్ర‌జ‌లు ఇప్పుడు అలా లేరు. ప‌థకం ఏదైనా మంచి ఉంటే, త‌మ‌కు మేలు చేస్తుంద‌ని అనుకుంటే కొన‌సాగించాల‌నే కోరుతున్నారు. కానీ జ‌గ‌న్ అన్నా క్యాంటీన్ వంటి కీల‌క కార్య‌క్ర‌మాన్ని ఎత్తేశారు. ప్ర‌జాభ‌వన్‌ను కూల‌దోశారు. అమ‌రావ‌తిని అట‌కెక్కించారు. ఈ ప‌రిణామం ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ అయింది.

ఇక ఇప్పుడు జ‌రుగుతున్న విష‌యానికి వ‌స్తే, అసెంబ్లీకి జ‌గ‌న్ వెళ్లాల‌ని మెజారిటీ ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇది ప్ర‌త్య‌ర్థులు చెబుతున్న మాట కాదు. ఆన్‌లైన్ ఛానెళ్లు చేస్తున్న స‌ర్వేలు చెబుతున్న మాట‌. జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడాల‌ని కోరుకునే వారు ఎక్కువ‌గా ఉన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని కూడా కోరుతున్నారు. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ల‌కుండా భీష్మించుకుంటున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తే ఏదో జాత‌ర‌లా వ‌స్తున్నారు. ఇది స‌రికాదు. ప్ర‌జ‌ల నాడి తెలుసుకుని వారికి అనుగుణంగా రాజ‌కీయాలు మ‌లుచుకునే దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఎంతైనా ఉంది.

Satya

Recent Posts

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

5 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

7 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

9 hours ago

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…

10 hours ago

తడబడుతున్న వైభవ్… ఒక్క సిక్స్ లేదు

ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…

11 hours ago

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…

11 hours ago