Political News

అమిత్ షాపై చిత్తు కాగితాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో అధికార పక్ష: ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆపై సభను స్పీకర్ కొంతసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు తమ ఆందోళనలను ఏమాత్రం తగ్గించలేదు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మూడు కీలక బిల్లులకు మంగళవారం నాటి కేబినెట్ బేటీ ఆమోద ముద్ర వేయగా వాటిని హోం మంత్రి హోదాలో అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. వీటిలో పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను క్రిమినల్ కేసుల ఆధారంగా పదవీచ్యుతులను చేసేందుకు ఉద్దేశించినది ఓ బిల్లు. ఈ బిల్లుపై విపక్షాలు అప్పటికే ఓ రేంజి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెట్టగానే… విపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి వెల్ లోకి దూసుకువచ్చారు. తమ చేతుల్లోని బిల్లుల ప్రతుల కాపీలను చించివేసి ఆ చిత్తు కాగితాలను షాపై విరిసిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

వాస్తవానికి అధికార పక్షం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గానీ, రాష్ట్రపతో, గవర్నరో ప్రసంగించేటప్పుడు గానీ… ఆయా బిల్లుల ప్రతులను చించివేసి సభాధ్యక్ష స్థానంపై విపక్షాలు విసిరివేయడం పరిపాటి. అయితే అందుకు బిన్నంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులంతా చిత్తు ప్రతులను అమిత్ షాపైకి విసిరివేశారు. అయితే ఈ తరహా నిరసనను అమిత్ షా ఏమాత్రం పట్టించుకోకుండానే తాను ప్రవేశపెట్టాలనుకున్న మరో రెండు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి… విపక్షాలకు అభ్యంతరం ఉందని చెబుతున్నారు కాబట్టి వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

46 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

12 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

12 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

13 hours ago