Political News

అమిత్ షాపై చిత్తు కాగితాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో అధికార పక్ష: ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆపై సభను స్పీకర్ కొంతసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు తమ ఆందోళనలను ఏమాత్రం తగ్గించలేదు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మూడు కీలక బిల్లులకు మంగళవారం నాటి కేబినెట్ బేటీ ఆమోద ముద్ర వేయగా వాటిని హోం మంత్రి హోదాలో అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. వీటిలో పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను క్రిమినల్ కేసుల ఆధారంగా పదవీచ్యుతులను చేసేందుకు ఉద్దేశించినది ఓ బిల్లు. ఈ బిల్లుపై విపక్షాలు అప్పటికే ఓ రేంజి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెట్టగానే… విపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి వెల్ లోకి దూసుకువచ్చారు. తమ చేతుల్లోని బిల్లుల ప్రతుల కాపీలను చించివేసి ఆ చిత్తు కాగితాలను షాపై విరిసిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

వాస్తవానికి అధికార పక్షం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గానీ, రాష్ట్రపతో, గవర్నరో ప్రసంగించేటప్పుడు గానీ… ఆయా బిల్లుల ప్రతులను చించివేసి సభాధ్యక్ష స్థానంపై విపక్షాలు విసిరివేయడం పరిపాటి. అయితే అందుకు బిన్నంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులంతా చిత్తు ప్రతులను అమిత్ షాపైకి విసిరివేశారు. అయితే ఈ తరహా నిరసనను అమిత్ షా ఏమాత్రం పట్టించుకోకుండానే తాను ప్రవేశపెట్టాలనుకున్న మరో రెండు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి… విపక్షాలకు అభ్యంతరం ఉందని చెబుతున్నారు కాబట్టి వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.

This post was last modified on August 20, 2025 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

2 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

2 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

2 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

3 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

3 hours ago

టీడీపీలో లోకేష్ శ‌కం… ఇక కథ వేరుంటది

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…

4 hours ago