Political News

అమిత్ షాపై చిత్తు కాగితాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో అధికార పక్ష: ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆపై సభను స్పీకర్ కొంతసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు తమ ఆందోళనలను ఏమాత్రం తగ్గించలేదు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మూడు కీలక బిల్లులకు మంగళవారం నాటి కేబినెట్ బేటీ ఆమోద ముద్ర వేయగా వాటిని హోం మంత్రి హోదాలో అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. వీటిలో పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను క్రిమినల్ కేసుల ఆధారంగా పదవీచ్యుతులను చేసేందుకు ఉద్దేశించినది ఓ బిల్లు. ఈ బిల్లుపై విపక్షాలు అప్పటికే ఓ రేంజి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెట్టగానే… విపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి వెల్ లోకి దూసుకువచ్చారు. తమ చేతుల్లోని బిల్లుల ప్రతుల కాపీలను చించివేసి ఆ చిత్తు కాగితాలను షాపై విరిసిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

వాస్తవానికి అధికార పక్షం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గానీ, రాష్ట్రపతో, గవర్నరో ప్రసంగించేటప్పుడు గానీ… ఆయా బిల్లుల ప్రతులను చించివేసి సభాధ్యక్ష స్థానంపై విపక్షాలు విసిరివేయడం పరిపాటి. అయితే అందుకు బిన్నంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులంతా చిత్తు ప్రతులను అమిత్ షాపైకి విసిరివేశారు. అయితే ఈ తరహా నిరసనను అమిత్ షా ఏమాత్రం పట్టించుకోకుండానే తాను ప్రవేశపెట్టాలనుకున్న మరో రెండు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి… విపక్షాలకు అభ్యంతరం ఉందని చెబుతున్నారు కాబట్టి వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.

This post was last modified on August 20, 2025 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

46 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago