Political News

అమిత్ షాపై చిత్తు కాగితాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో అధికార పక్ష: ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆపై సభను స్పీకర్ కొంతసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు తమ ఆందోళనలను ఏమాత్రం తగ్గించలేదు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మూడు కీలక బిల్లులకు మంగళవారం నాటి కేబినెట్ బేటీ ఆమోద ముద్ర వేయగా వాటిని హోం మంత్రి హోదాలో అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. వీటిలో పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను క్రిమినల్ కేసుల ఆధారంగా పదవీచ్యుతులను చేసేందుకు ఉద్దేశించినది ఓ బిల్లు. ఈ బిల్లుపై విపక్షాలు అప్పటికే ఓ రేంజి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెట్టగానే… విపక్ష సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి వెల్ లోకి దూసుకువచ్చారు. తమ చేతుల్లోని బిల్లుల ప్రతుల కాపీలను చించివేసి ఆ చిత్తు కాగితాలను షాపై విరిసిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

వాస్తవానికి అధికార పక్షం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గానీ, రాష్ట్రపతో, గవర్నరో ప్రసంగించేటప్పుడు గానీ… ఆయా బిల్లుల ప్రతులను చించివేసి సభాధ్యక్ష స్థానంపై విపక్షాలు విసిరివేయడం పరిపాటి. అయితే అందుకు బిన్నంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులంతా చిత్తు ప్రతులను అమిత్ షాపైకి విసిరివేశారు. అయితే ఈ తరహా నిరసనను అమిత్ షా ఏమాత్రం పట్టించుకోకుండానే తాను ప్రవేశపెట్టాలనుకున్న మరో రెండు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి… విపక్షాలకు అభ్యంతరం ఉందని చెబుతున్నారు కాబట్టి వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.

This post was last modified on August 20, 2025 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago