Political News

అస‌లు.. వైసీపీ బాధేంటి?

ఊరంద‌రిదీ ఒక‌దారైతే.. వైసీపీది మ‌రో దారి అన్న‌ట్టుగా ఉంది రాజకీయం. మ‌రి ఆ పార్టీ నాయ‌కులు ఆలోచించి మాట్లాడుతు న్నారో.. ఆలోచ‌న లేకుండానే విమ‌ర్శ‌లు చేస్తున్నారో తెలియ‌దు కానీ.. ప్ర‌జ‌ల ముందు మాత్రం చుల‌క‌న అవుతున్నారు. నెటిజ న్ల నుంచి ట్రోల్స్‌కు గుర‌వుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. స్త్రీ శ‌క్తి పేరుతో ఆర్టీసీ బ‌స్సుల‌ను మ‌హిళ‌ల‌కు చేరు వ చేసింది. ఏపీలో ఇలాంటి కార్య‌క్ర‌మం అమ‌లు చేయ‌డం ఇదే తొలిసారి.

ఈ ప‌థ‌కం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఏటా సుమారు 2 వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌నుంది. ఇక‌, దీనిపై స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు అయితే.. సీఎం చంద్ర‌బాబుకు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు రుణ ప‌డి ఉంటామ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో అయితే..చంద్ర‌బాబు చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు కూడా నిర్వ‌హిం చి త‌మ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ‌స్టాండుల్లోనూ మ‌హిళ‌ల సంద‌డి జోరుగా పెరిగింది. కుటుంబాల కు కుటుంబాలు ఉచిత బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తూ.. ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కంపై ఆనందం వ్య‌క్తం చేస్తుంటే.. వైసీపీ మాత్రం కోడిగుడ్డుపై ఈక‌లు పీకుతున్న‌ట్టుగా.. ఈ ప‌థ కంపై ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేస్తోంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌కు కూట‌మి స‌ర్కారు అన్యాయం చేసింద‌ని, ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం అంటూ మోసం చేసింద‌ని అన్నారు. ఆర్టీసీలో మొత్తం 16 ర‌కాల బ‌స్సులు ఉన్నాయ‌ని, వాటిలో కేవ‌లం 5 ర‌కాల బ‌స్సుల్లో మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అమ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దూర ప్రాంతాల‌కువెళ్లేవారు.. నాలుగు బ‌స్సులు మారి వెళ్లే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు.

కానీ, వాస్త‌వం ఏంటంటే.. ఏపీలో ఈ ప‌థ‌కం ఇప్పుడు అమ‌లైనా.. తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో దాదాపుఏడాదిన్న‌రగా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌ల్లో ఉంది. అయితే.. అక్క‌డ కూడా ఇలానే ఎంపిక చేసిన స‌ర్వీసుల్లోనే ప్ర‌యాణాల‌ను అనుమ‌తిస్తున్నా రు. ఏపీలో ఐదు ర‌కాల బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం అమ‌ల్లో ఉంటే.. తెలంగాణ‌లో నాలుగు ర‌కాల బ‌స్సుల్లోనే ఉచితాన్ని అమ‌లు చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో కేవ‌లం జిల్లాల ప‌రిధికే ప‌రిమితం చేశారు. ఇవ‌న్నీ వాస్త‌వాలు. ఇక‌, ఉచిత ప్ర‌యాణానికే మొత్తం స‌ర్వీసులు కేటాయిస్తే.. ఆర్టీసీపైన‌, ప్ర‌భుత్వంపైనా ఆర్థిక భారం కాదా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఉచిత హామీలు అంటే.. పూర్తిగా తుడిచి పెట్టేయ‌డం కాదు క‌దా?. వ్య‌వ‌స్థ‌ల ఆర్థిక ప‌రిస్థితిని కూడా గ‌మ‌నించాలి. ఇవ‌న్నీ వ‌దిలేసి..వైసీపీ త‌న బాధ‌ను ప్ర‌పంచం బాధ‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది.

This post was last modified on August 17, 2025 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

59 minutes ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

1 hour ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

1 hour ago

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

2 hours ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

2 hours ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

3 hours ago