ఆడలేక మద్దెల ఓడు అన్నది పాత సామెత. అంటే ఒక పని చేతకానప్పుడు ఏదో సాకుని వెతికే వాళ్లను ఉద్దేశించి దీన్ని రాశారు. తమిళ దర్శకులకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. గజిని, తుపాకీలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన మదరాసి వచ్చే నెల సెప్టెంబర్ 5 విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా వెయ్యి కోట్లకు వసూలు చేసే ఇతర బాషల ప్యాన్ ఇండియా సినిమాల ప్రస్తావన వచ్చింది. కోలీవుడ్ లో అలాంటివి ఎందుకు తీయలేకపోతున్నారంటే దానికాయన చెప్పిన సమాధానం మహా విచిత్రంగా ఉంది.
వెయ్యి కోట్ల సినిమాలు తీసే దర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రేక్షకులను కేవలం ఎంటర్ టైన్ మాత్రమే చేస్తారని, కానీ తమిళ డైరెక్టర్లు ఎడ్యుకేట్ చేస్తారని సెలవిచ్చారు. ఇదే ఇద్దరి మధ్య వ్యత్యాసమని చెప్పుకొచ్చారు. వినగానే నవ్వొచ్చే స్టేట్ మెంట్ ఇది. ఎక్కడి దాకో ఎందుకు ఈయనే తీసిన సికందర్ లో ఎలాంటి మెసేజ్ ఉందో చెబితే వినొచ్చు. దాన్ని ఆడియన్స్ ఎందుకు తిరస్కరించారో వివరిస్తే నేరుకోవచ్చు. ఇటీవలే విడుదలైన కూలీలో లోకేష్ కనగరాజ్ ఏం నేర్పించాడు. ది వారియర్ లో లింగుస్వామి, కస్టడీలో వెంకట్ ప్రభు ఏం ఎడ్యుకేట్ చేశారో తెలియదు కానీ నిర్మాతలనైతే నష్టాల్లో ముంచేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ భాషలో అయినా సినిమాలు తీసేది బిజినెస్ కోసమే తప్ప సమాజాన్ని ఉద్దరించడానికి లేదు. ఆ మాటకొస్తే మదరాసి కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. పన్ను రాయితీలు ఇచ్చి స్కూల్ పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా షోలు వేయరు కదా. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఖచ్చితంగా ట్రోలింగ్ కు దారి తీస్తాయి. పదే పదే కులవివక్ష మీద సినిమాలు తీస్తూ జనాలకు క్లాసులు పీకే బ్యాచి కన్నా ప్రొడ్యూసర్లకు నాలుగు డబ్బులొచ్చేలా చేసే దర్శకులు టాలీవుడ్ లోనే ఎక్కువగా ఉన్నారు. తమిళంలో వెయ్యి కోట్ల సినిమా రాదేమోననే ఫ్రస్ట్రేషన్ ఇలా అందరినీ పక్కదోవ పట్టిస్తోంది.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…