Political News

ఎంత ఎదిగిపోయావ‌య్యా.. బాబుకు కోట్లాది ఆశీస్సులు ..!

టీడీపీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌హిళ‌ల నుంచి ఆశీస్సులు ద‌క్కుతున్నాయి. ఎంత ఎదిగిపోయావ‌య్యా.. అంటూ వంద‌లాది మంది మ‌హిళ‌లు ఆయ‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. తాజాగా అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన ‘స్త్రీ శ‌క్తి’ ప‌థ‌కం.. ఏపీకి సంబంధించినంత వ‌ర‌కు చాలా కొత్త‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌మూ ఈ ప‌థ‌కాన్ని ఏపీలో అమ‌లు చేయ‌లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేందుకు అవ‌కాశం క‌ల్పించా రు.

వాస్త‌వానికి ఈ ప‌థ‌కం అమ‌లుపై ప్ర‌భుత్వం అనేక సార్లు ఆలోచ‌న చేసుకుంది. నెల‌కు ఎంత లేద‌న్నా.. 300 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించ‌క‌ త‌ప్ప‌దు. దీంతో ఒక‌టికి నాలుగు సార్లు ఆలోచించి.. ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది. దీనిపై వైసీపీ ఆది నుంచి కూడా విమ‌ర్శ‌లు చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది దాటిపోయినా.. ఇంకా ఉచిత బ‌స్సును ప్రారంభించ‌లేద‌ని.. మ‌హిళ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని.. జ‌గ‌న్ స్వ‌యంగా అనేక సంద‌ర్భాల్లో ఆరోపించారు.

దీంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చుకు వెర‌వ‌కుండా స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌పై మ‌హిళా లోకం.. ఆనందం వ్య‌క్తం చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు ప‌ట్ల కృత‌జ్ఞ‌త చాటుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌లు.. చంద్ర‌బాబు ఇంత చేస్తార‌ని అనుకోలేద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వృధ్ధులు అయితే.. చంద్ర‌బాబు ఎంతో ఎదిగిపోయార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోక‌పోయినా.. త‌మ‌కు ఉచిత‌బ‌స్సు ఇచ్చార‌ని.. యువ‌తులు అంటున్నారు.

ఇక‌, ఇత‌ర రాష్ట్రాల్లో అనేక మార్లు అధ్య‌యనం చేసిన చంద్ర‌బాబు.. అక్క‌డ అమ‌ల‌వుతున్న దానికంటే కూడా.. మ‌రిన్ని రెట్లు ఎక్కువ‌గా ఇక్క‌డ అమ‌లు కావాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే.. ఉచిత ప‌థకాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. తొలిసారి జిల్లాల‌కే ప‌రిమితం చేయాల‌ని అనుకున్నా.. వైసీపీ విమ‌ర్శ‌ల‌తో దీనిని వెన‌క్కి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బ‌స్సుల‌ను అమ‌లు చేస్తున్నారు. నిజానికి ఇత‌ర ప‌థ‌కాల‌తో పోల్చుకుంటే.. ఆర్టీసీ కి అయ్యే వ్య‌యం త‌క్కువ‌గానే ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు వేరే ప‌థ‌కాన్ని అమ‌లు చేయాలంటే.. ఒకేసారి 10 నుంచి 20 వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నారు కానీ, ఆర్టీసీకి ఏటా 2 వేల కోట్లు ఇస్తే.. చాలు. దీంతోనే ఈ ప‌థ‌కాన్ని ప‌ట్టాలెక్కించారు.

This post was last modified on August 16, 2025 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago