అధికారంలో ఉంటే.. ఒకలా, అధికారం కోల్పోతే మరోలా వ్యవహరించడం నాయకుల లక్షణం. అయితే.. దేశానికి సంబంధించిన పండుగల విషయంలో కూడా ఇలానే చేయడం విమర్శలకు తావిస్తోంది. ము ఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగరేస్తారేమో.. పార్టీ కార్యకర్తలు, లేదా తమకు ఓటేసిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారేమో.. అని నాయకు లు ఎదురు చూశారు. కానీ, ఆ జాడ ఎక్కడా కనిపించలేదు.
తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ జాడ ఎక్కడా కనిపించలేదు. మరి ఆయన ఉన్నారో.. లేక బెంగళూరుకు వెళ్లారో కూడా సమాచారం లేదు. ఇదిలావుంటే.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జగన్, ఓ చిన్న ట్వీట్తో సరిపుచ్చారు. ‘సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన స్వాతంత్య్రానికి మూలం. ప్రజాస్వామ్య దేశానికి ఇవే బలంగా నిలుస్తాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఇంతకు మించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కానీ, ప్రసంగాలు చేయడం కానీ.. చేయలేదు.
అంతా సజ్జలే..
మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సర్వం సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి మయంగా మారిపోయింది. పార్టీ తరఫున విజయందక్కించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు చాలా మంది ఉన్నా.. సజ్జలే జెండా ఆవిష్కరించి.. రాజకీయ ప్రసంగం చేయడంతో అందరూ చిన్నబుచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో మహిళలకు అవకాశం ఇస్తారని.. వారితో జెండా ఆవిష్కరణ చేయిస్తారని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు.
కానీ, దీనికి భిన్నంగా సజ్జలే రాజకీయ ప్రసంగంతోపాటు.. జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భం గా పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోలేదని.. ఓడించారని వ్యాఖ్యా నించారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలను నిర్బంధించి.. వారే ఓట్లు వేసుకున్నారని తెలిపారు. తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని.. ప్రజాస్వామ్య వాదులు సహకరించాలని సజ్జల కోరారు. ఇక, గత ఎన్నికల్లో కూడా ఓట్ల చౌర్యం జరిగే.. రాష్ట్రంలో వైసీపీ పరాజయం పాలైందన్నారు.
This post was last modified on August 15, 2025 4:55 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…