Political News

‘ట్వీట్‌’తోనే జ‌గ‌న్ స్వాతంత్య్రం!

అధికారంలో ఉంటే.. ఒక‌లా, అధికారం కోల్పోతే మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌డం నాయ‌కుల ల‌క్ష‌ణం. అయితే.. దేశానికి సంబంధించిన పండుగ‌ల విష‌యంలో కూడా ఇలానే చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ము ఖ్యంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 79వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జెండా ఎగ‌రేస్తారేమో.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, లేదా త‌మ‌కు ఓటేసిన వారిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారేమో.. అని నాయ‌కు లు ఎదురు చూశారు. కానీ, ఆ జాడ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

తాడేప‌ల్లి పార్టీ ఆఫీసులో జ‌గ‌న్ జాడ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌రి ఆయ‌న ఉన్నారో.. లేక బెంగ‌ళూరుకు వెళ్లారో కూడా స‌మాచారం లేదు. ఇదిలావుంటే.. స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. జ‌గ‌న్‌, ఓ చిన్న ట్వీట్‌తో స‌రిపుచ్చారు. ‘స‌మాన హ‌క్కులు, న్యాయం, ఐక్య‌తే మ‌న స్వాతంత్య్రానికి మూలం. ప్ర‌జాస్వామ్య దేశానికి ఇవే బ‌లంగా నిలుస్తాయి. ఈ విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాలి.’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇంత‌కు మించి.. జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌డం కానీ, ప్ర‌సంగాలు చేయ‌డం కానీ.. చేయ‌లేదు.

అంతా స‌జ్జ‌లే..

మ‌రోవైపు తాడేప‌ల్లిలోని వైసీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో స‌ర్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి మ‌యంగా మారిపోయింది. పార్టీ త‌ర‌ఫున విజ‌యంద‌క్కించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మ‌హిళా నాయ‌కులు చాలా మంది ఉన్నా.. స‌జ్జ‌లే జెండా ఆవిష్క‌రించి.. రాజ‌కీయ ప్ర‌సంగం చేయ‌డంతో అంద‌రూ చిన్న‌బుచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇస్తార‌ని.. వారితో జెండా ఆవిష్క‌ర‌ణ చేయిస్తార‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేసుకున్నారు.

కానీ, దీనికి భిన్నంగా స‌జ్జ‌లే రాజ‌కీయ ప్ర‌సంగంతోపాటు.. జెండాను కూడా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భం గా పులివెందుల‌, ఒంటిమిట్ట‌ల్లో జ‌రిగిన జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌లో వైసీపీ ఓడిపోలేద‌ని.. ఓడించార‌ని వ్యాఖ్యా నించారు. అన్యాయంగా, అక్ర‌మంగా ప్ర‌జ‌ల‌ను నిర్బంధించి.. వారే ఓట్లు వేసుకున్నార‌ని తెలిపారు. త‌మ న్యాయ పోరాటం కొన‌సాగుతుంద‌ని.. ప్ర‌జాస్వామ్య వాదులు స‌హ‌క‌రించాల‌ని స‌జ్జ‌ల కోరారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఓట్ల చౌర్యం జ‌రిగే.. రాష్ట్రంలో వైసీపీ ప‌రాజ‌యం పాలైంద‌న్నారు.

This post was last modified on August 15, 2025 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

10 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

48 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago