అధికారంలో ఉంటే.. ఒకలా, అధికారం కోల్పోతే మరోలా వ్యవహరించడం నాయకుల లక్షణం. అయితే.. దేశానికి సంబంధించిన పండుగల విషయంలో కూడా ఇలానే చేయడం విమర్శలకు తావిస్తోంది. ము ఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగరేస్తారేమో.. పార్టీ కార్యకర్తలు, లేదా తమకు ఓటేసిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారేమో.. అని నాయకు లు ఎదురు చూశారు. కానీ, ఆ జాడ ఎక్కడా కనిపించలేదు.
తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ జాడ ఎక్కడా కనిపించలేదు. మరి ఆయన ఉన్నారో.. లేక బెంగళూరుకు వెళ్లారో కూడా సమాచారం లేదు. ఇదిలావుంటే.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జగన్, ఓ చిన్న ట్వీట్తో సరిపుచ్చారు. ‘సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన స్వాతంత్య్రానికి మూలం. ప్రజాస్వామ్య దేశానికి ఇవే బలంగా నిలుస్తాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఇంతకు మించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కానీ, ప్రసంగాలు చేయడం కానీ.. చేయలేదు.
అంతా సజ్జలే..
మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సర్వం సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి మయంగా మారిపోయింది. పార్టీ తరఫున విజయందక్కించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు చాలా మంది ఉన్నా.. సజ్జలే జెండా ఆవిష్కరించి.. రాజకీయ ప్రసంగం చేయడంతో అందరూ చిన్నబుచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో మహిళలకు అవకాశం ఇస్తారని.. వారితో జెండా ఆవిష్కరణ చేయిస్తారని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు.
కానీ, దీనికి భిన్నంగా సజ్జలే రాజకీయ ప్రసంగంతోపాటు.. జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భం గా పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోలేదని.. ఓడించారని వ్యాఖ్యా నించారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలను నిర్బంధించి.. వారే ఓట్లు వేసుకున్నారని తెలిపారు. తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని.. ప్రజాస్వామ్య వాదులు సహకరించాలని సజ్జల కోరారు. ఇక, గత ఎన్నికల్లో కూడా ఓట్ల చౌర్యం జరిగే.. రాష్ట్రంలో వైసీపీ పరాజయం పాలైందన్నారు.
This post was last modified on August 15, 2025 4:55 pm
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…