Political News

నేత‌ల ‘అతి’ వైసీపీ కొంప ముంచుతోందా!

నేత‌లు త‌మ త‌మ స్థాయిని గుర్తించి వ్య‌వ‌హరించాలి. అది ఏ పార్టీ అయినా.. నాయ‌కుల తీరులో స్ప‌ష్ట‌త‌.. చేసే ఆరోప‌ణ‌ల‌కు ప్రాధాన్యం తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాలి. కానీ.. వైసీపీలో విజ్ఞ‌త‌లేని నాయ‌కులు చేస్తున్న అతి కార‌ణంగా.. ఆ పార్టీ పుట్టి మునిగిపోతోంది. అస‌లు ఆ పార్టీ అధినేత‌కే విజ్ఞ‌త లేద‌ని అనే వారు కూడా ఉన్నారు. స‌రే.. తాజాగా పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. స‌హ‌జంగానే ఈ ఓటమి.. వైసీపీ నేత‌ల్లో అక్క‌సుపెంచింది. ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌త్తెన‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. మ‌రో అడుగు ముందుకు వేసి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎక్క‌డో ప‌శ్చిమ బెంగాల్ లో ఏడాది కింద‌ట జ‌రిగిన ఓ స్థానిక ఎన్నిక‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో.. ఓ యువ‌కుడు భారీ ఎత్తున రిగ్గింగుకు పాల్ప‌డుతున్నాడు. దీనిని పులివెందుల‌లోనే జ‌రిగిన‌ట్టుగా అంబ‌టి పేర్కొన్నారు. అంతేకాదు.. ఇది “కోయ ప్ర‌వీణ్ ఐపీఎస్‌కు అంకితం” అంటూ కామెంట్ చేశారు.

అయితే.. దీని పూర్వాప‌రాలు తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు.. సోష‌ల్ మీడియాలో వైసీపీని ఏకేశారు. ఇక , పులివెందుల‌కే చెందిన వైసీపీ నాయ‌కుడు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా.. మ‌రోకీల‌క వ్యాఖ్య చేసి.. విమ‌ర్శ లు ఎదుర్కొన్నారు. 6 వేల మెజారిటీ వ‌చ్చిన‌.. ల‌తా రెడ్డి(టీడీపీ అభ్య‌ర్థి).. ఓటు వేసిన వారి వేళ్ల‌కు ఇంకు చూపించ‌గ‌ల‌రా? అని స‌వాల్ రువ్వారు. కానీ, ఇది బెడిసికొట్టింది. దీనిపై ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. అలానే.. ఇత‌ర నాయ‌కులు కూడా.. ఒంటిమిట్ట ఉప పోరుపై వ్యాఖ్య‌లు చేయ‌గా.. వాటిని ఎన్నిక‌ల అధికారులే ఖండించారు. మొత్తంగా నేత‌ల అతి.. వైసీపీకి క‌లిసి రాక‌పోగా.. మ‌రింత విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.

This post was last modified on August 15, 2025 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago