నేతలు తమ తమ స్థాయిని గుర్తించి వ్యవహరించాలి. అది ఏ పార్టీ అయినా.. నాయకుల తీరులో స్పష్టత.. చేసే ఆరోపణలకు ప్రాధాన్యం తెలుసుకుని వ్యవహరించాలి. కానీ.. వైసీపీలో విజ్ఞతలేని నాయకులు చేస్తున్న అతి కారణంగా.. ఆ పార్టీ పుట్టి మునిగిపోతోంది. అసలు ఆ పార్టీ అధినేతకే విజ్ఞత లేదని అనే వారు కూడా ఉన్నారు. సరే.. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. సహజంగానే ఈ ఓటమి.. వైసీపీ నేతల్లో అక్కసుపెంచింది. ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.
ఓకే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మరో అడుగు ముందుకు వేసి జగన్ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో ఏడాది కిందట జరిగిన ఓ స్థానిక ఎన్నికకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో.. ఓ యువకుడు భారీ ఎత్తున రిగ్గింగుకు పాల్పడుతున్నాడు. దీనిని పులివెందులలోనే జరిగినట్టుగా అంబటి పేర్కొన్నారు. అంతేకాదు.. ఇది “కోయ ప్రవీణ్ ఐపీఎస్కు అంకితం” అంటూ కామెంట్ చేశారు.
అయితే.. దీని పూర్వాపరాలు తెలుసుకున్న టీడీపీ నాయకులు.. సోషల్ మీడియాలో వైసీపీని ఏకేశారు. ఇక , పులివెందులకే చెందిన వైసీపీ నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా.. మరోకీలక వ్యాఖ్య చేసి.. విమర్శ లు ఎదుర్కొన్నారు. 6 వేల మెజారిటీ వచ్చిన.. లతా రెడ్డి(టీడీపీ అభ్యర్థి).. ఓటు వేసిన వారి వేళ్లకు ఇంకు చూపించగలరా? అని సవాల్ రువ్వారు. కానీ, ఇది బెడిసికొట్టింది. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అలానే.. ఇతర నాయకులు కూడా.. ఒంటిమిట్ట ఉప పోరుపై వ్యాఖ్యలు చేయగా.. వాటిని ఎన్నికల అధికారులే ఖండించారు. మొత్తంగా నేతల అతి.. వైసీపీకి కలిసి రాకపోగా.. మరింత విమర్శలు వచ్చేలా చేసింది.
This post was last modified on August 15, 2025 12:14 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…