‘జగన్ అంటే అసహ్యం వేస్తోంది. ఇంత నిర్లజ్జగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు.’ అని టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యం గురించి, విలువ గురించి.. ఆయన మాట్లాడుతుంటే.. అసహ్యంగా ఉందన్నారు. తాజాగా స్పీకర్ అయ్యన్న సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ప్రజలు స్వయంగా చెబుతున్న దాని ప్రకారం.. ఇక్కడ 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయన్నారు.
అయినా.. జగన్ ఏదో జరిగిపోయిందని వ్యాఖ్యలు చేస్తుంటే.. అసహ్యంగా అనిపిస్తోందని అయ్యన్న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అందరూ గౌరవించాలన్న ఆయన.. దీనికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత అసహ్యంగా ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగాయో.. గుర్తులేదా? అని ప్రశ్నించారు. కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకుని.. రక్తపాతం సృష్టించారని గుర్తు చేశారు.
పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్కు ఎక్కడిదని ప్రశ్నించారు. “నువ్వు నరకానికి పోతావ్” అంటూ.. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండించాలని.. జగన్కు బుద్ది వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి భారమని వ్యాఖ్యానించారు. అందుకే పులివెందుల ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు.
వస్తారా? రారా?
ఇదిలావుంటే.. వచ్చే నెలలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని స్పీకర్ అయ్యన్న తెలిపారు. మరి ఈ సమావేశాలకైనా వైసీపీ నాయకులు వస్తారో రారో తేల్చుకోవాలని చెప్పారు. వస్తే.. రెండు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తామన్న ఆయన.. వైసీపీ రాకపోతే.. ఆ రెండు ప్రశ్నలను వేరే పార్టీ సభ్యులకు కేటాయిస్తామని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు వేసే సంస్కృతి ఇక నుంచి ఉండబోదని హెచ్చరించారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…