Political News

జగన్ కు తెలంగాణ ఎంపీ ఇచ్చిపడేశారు!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాట్ లైన్ లో ఉంటారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్లు ఇవ్వడంలో ఓ రేంజి స్పీడు చూపించే టీ కాంగ్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. జగన్ కు ఇచ్చిపడేశారనే చెప్పాలి. రాహుల్ ను గానీ, రేవంత్ ను గానీ విమర్శించే అర్హతే జగన్ కు లేదంటూ జగన్ కు గట్టిగా బదులిచ్చారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయింది ప్రదాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల వల్లేనని కిరణ్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన తన పార్టీ ఓటమిపై జగన్ ఏదైనా విమర్శ చేయాలనుకుంటే… మోదీ, షాలను విమర్శించాలని ఆయన సూచించారు. అంతటితో ఆగని కిరణ్… అయినా మోదీ, షాలతో పాటు ఏ ఒక్క బీజేపీ నేతను కూడా విమర్శించే దమ్ము జగన్ కు లేదని కూడా తేల్చి పారేశారు. ఎందుకంటే… ఎక్కడ తనపై ఉన్న కేసులను మోదీ, షాలు తిరగదోడతారోననే భయం జగన్ ను నిత్యం వెంటాడుతూనే ఉందని కిరణ్ తెలిపారు.

అక్కడితో కూడా ఆగని కిరణ్… 2024 సార్వత్రిక ఎన్నికల దాకా బాగానే ఉన్న జగన్… ఆ ఎన్నికల్లో ఓటమి దక్కగానే విచిత్రంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత జగన్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఈ తరహా విచిత్ర వైఖరి కలిగిన రాజకీయ నేతలను తాను ఇప్పటిదాకా చూడలేదని ఆయన అన్నారు. వాస్తవాలను జగన్ ఇప్పటికైనా తెలుసుకుని మసలుకోవాలని, అనవసరంగా తమ నేతలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కిరణ్ హెచ్చరించారు.

This post was last modified on August 13, 2025 9:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

37 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

2 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

2 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

3 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago