కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాట్ లైన్ లో ఉంటారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్లు ఇవ్వడంలో ఓ రేంజి స్పీడు చూపించే టీ కాంగ్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. జగన్ కు ఇచ్చిపడేశారనే చెప్పాలి. రాహుల్ ను గానీ, రేవంత్ ను గానీ విమర్శించే అర్హతే జగన్ కు లేదంటూ జగన్ కు గట్టిగా బదులిచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయింది ప్రదాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల వల్లేనని కిరణ్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన తన పార్టీ ఓటమిపై జగన్ ఏదైనా విమర్శ చేయాలనుకుంటే… మోదీ, షాలను విమర్శించాలని ఆయన సూచించారు. అంతటితో ఆగని కిరణ్… అయినా మోదీ, షాలతో పాటు ఏ ఒక్క బీజేపీ నేతను కూడా విమర్శించే దమ్ము జగన్ కు లేదని కూడా తేల్చి పారేశారు. ఎందుకంటే… ఎక్కడ తనపై ఉన్న కేసులను మోదీ, షాలు తిరగదోడతారోననే భయం జగన్ ను నిత్యం వెంటాడుతూనే ఉందని కిరణ్ తెలిపారు.
అక్కడితో కూడా ఆగని కిరణ్… 2024 సార్వత్రిక ఎన్నికల దాకా బాగానే ఉన్న జగన్… ఆ ఎన్నికల్లో ఓటమి దక్కగానే విచిత్రంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత జగన్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఈ తరహా విచిత్ర వైఖరి కలిగిన రాజకీయ నేతలను తాను ఇప్పటిదాకా చూడలేదని ఆయన అన్నారు. వాస్తవాలను జగన్ ఇప్పటికైనా తెలుసుకుని మసలుకోవాలని, అనవసరంగా తమ నేతలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కిరణ్ హెచ్చరించారు.
This post was last modified on August 13, 2025 9:40 pm
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…
థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…
వైసీపీ అధినేత జగన్ వెనుక ఉండే కార్యకర్తలు, యువత అంతా `జెన్జీ` అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా…