ఏపీలో అటు అధికార పక్షం రథసారథి టీడీపీ, ఇటు విపక్షం వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం కూడా ఈ విచిత్రాల పరంపర కొనసాగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక తీరుపై ఒకింత అనుమానం కలిగిన ఎన్నికల సంఘం… రెండు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో రీపోలింగ్ బుధవారం ప్రారంభం కాగా… వైసీపీ అభ్యర్థి మాత్రం తాడేపల్లిలోని జగన్ వద్దకు చేరిపోయారు. జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దర్శనమిచ్చారు.
పులివెందులతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ వైసీపీ ముందుగానే చేతులెత్తేసిందని ఇదివరకే చెప్పుకున్నాం కదా. అదే మాదిరిగా వైసీపీ వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం పోలింగ్ జరుగుతూ ఉంటే… వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఇంటి గడప కూడా దాటకుండా తాము ఓటు వేసేందుకు అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు భద్రత కల్పించడంలో పోలీసులు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. అయితే ఇద్దరు పోలీసులతో హేమంత్ కు భద్రత కల్పించామని, వారిలో ఓ సీఐ స్థాయి అధికారి కూడా ఉన్నారని స్వయంగా కడప జిల్లా ఎస్పీనే ప్రకటించడం గమనార్హం.
ఇక తాజాగా రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే… రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన ఆయన.. కేవలం పోలీసులను రక్షించేందుకే ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లోనే.. అది కూడా ఎలాంటి గొడవలు జరగని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణకు సిద్ధపడిందని ఆయన తనదైన శైలి వితండ వాదనను వినిపించారు. మొత్తంగా రీపోలింగ్ ను వైసీపీ అయితే బహిష్కరించింది. జగన్ పిలుపు మేరకు ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డితో కలిసి హేమంత్ రెడ్డి ఎంచక్కా తాడేపల్లి చేరుకుని జగన్ కు అటొకరు, ఇటొకరు కూర్చుని మీడియా కెమెరాలకు కనిపించారు.
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…