పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీ ముందే చేతులెత్తేసిందా? గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత ప్రతిఘటనను ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఎదుర్కొంటుందా? అంటే పులివెందుల తాజా రాజకీయ వాతావరణం చూస్తుంటే అవుననే చెప్పాలి.
పులివెందుల జెడ్పిటిసికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ జెడ్పిటిసి పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఏజెంట్లను బూత్లలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వెళ్లిన టిడిపి కార్యకర్తలు పులివెందును ఆక్రమించారు. చివరికి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారంటే అక్కడ అధికార పార్టీ ఏ స్థాయిలో మేనేజ్మెంట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ జెడ్పిటిసి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి టిడిపి వాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని అరాచకానికి తెరలేపారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక దశలో వైసీపీ ఎన్నికలను బహిష్కరిస్తుందని సొంత పార్టీ వాళ్లతో పాటు టిడిపి నాయకులు కూడా అనుకున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కావడంతో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఇతర ముఖ్య నాయకులపై దాడి జరిగింది. అయినా వైసీపీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చేతులు ఎత్తేయలేదు.
ఈ జెడ్పిటిసి పదవీకాలం మరో 10 నెలలు మాత్రమే ఉంది. దీనికోసం పులివెందులలో ఇంతటి అరాచకానికి పాల్పడటం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 15 పోలింగ్ బూత్ల పరిధిలో కనీసం వైసీపీ ఏజెంట్లను కూడా అడుగుపెట్టకుండా టిడిపి రాజకీయం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడుసార్లు ఎంపీగా గెలిచిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం పోలీసులు ఈడ్చికెళ్లి జీపులో వేశారు. ఆయనను కడప తీసుకు వెళ్లారు. మరోవైపు టిడిపి రౌడీ మూకలు బూత్లు ఆక్రమించుకొని తమ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించామని చెప్పుకోవటంలో ఆ కిక్కే వేరని టిడిపి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పోలింగ్కు ముందు పరిస్థితులు చూస్తుంటే వైసీపీ ముందే చేతులెత్తేసిందా అన్నట్టుగానే ఉంది.
This post was last modified on August 12, 2025 11:30 am
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…