Political News

తిరుమ‌ల‌లో రాజకీయాలేంది జగన్ మేనమామా?

జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమలలో రాజకీయ చిందులు తొక్కారు. తిరుమల పవిత్రతకు ఓ నాయకుడిగా పెద్దపీట వేయాల్సిన ఆయన, టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ, తిరుమల శ్రీవారి ఆలయం ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన విమర్శలు గుప్పించారు. వాస్తవానికి తిరుమలలో రాజకీయ విమర్శలు చేయొద్దంటూ పాలక మండలి కొన్ని వారాల కిందట తీర్మానం చేసింది.

దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేసింది. తిరుమలకు వచ్చే నేతలు ఎలాంటి విమర్శలు చేయొద్దని కూడా టీటీడీ బోర్డు ప్రకటించింది. అయితే కొందరు నాయకులు సైలెంట్‌గా ఉంటే, మరికొందరు రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అందరినీ మించి రవీంద్రనాథ్ రెడ్డి చిందులు తొక్కారు. సీఎం చంద్రబాబుపైనా, కూటమి ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. పులివెందులలో అరాచకాలకు సీఎం శ్రీకారం చుట్టారని, రాజకీయ ఉన్మాదం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పులివెందులలో రాజకీయాలను నీచంగా మార్చేస్తున్నారని, జెడ్పీటీసీ ఎన్నికలకు గతంలో ఎప్పుడూ నోటిఫికేషన్ ఇవ్వలేదని, తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారని, దీనిని కూడా చంద్రబాబు నేతృత్వంలోనే ఇచ్చారని అన్నారు. హత్యలు చేస్తున్నారని, వైసీపీ నాయకులపై దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తిరుమలలో వ్యాఖ్యానించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయింది. ఆయనపై బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తిరుమల పాలక మండలి చేసిన తీర్మానంలోని నిబంధనలను ఉల్లంఘించిన నేరంపై రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేయనున్నట్టు చెప్పారు. అయితే ముందుగా ఆయన నుంచి వివరణ తీసుకుంటామని తెలిపారు. వాస్తవానికి తిరుమలలో ఒకప్పుడు ఉన్న రాజకీయాలను తగ్గించేందుకు ప్రస్తుత బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.

This post was last modified on August 11, 2025 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago