Political News

‘ట్యాపింగ్’ను ‘బండి’ ట్రాక్ లోకి తెచ్చినట్టేనా?

తెలంగాణలో చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటికప్పుడు పెను కలకలమే రేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నికలకు ముందు విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారి వ్యూహాలను తెలుసుకుని అధికార పార్టీ నేతలు వాటికి ప్రతివ్యూహాలు పన్నినట్టుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయగా.. ఇప్పటికే సిట్ కేసులో కీలక నిందితులను విచారించింది. బాధితులనూ విచారించి సాక్ష్యాలు సేకరించింది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్ కు బండి ఇచ్చిన ఆధారాలు ఈ కేసును సరైన పట్టాల మీదకు తెచ్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ కూడా బాధితుడే. 2023 ఎన్నికలకు ముందు బండి సంజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ఇంటిలో పనిచేసేవారు. బండితో సన్నిహితంగా తిరిగే నేతలు, ఆయనను అనుసరించే బీజేపీ కీలక నేతలు… ఇలా చాలా మంది నేతల ఫోన్టను నాటి బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేయించిందట. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యే ముందు స్వయంగా బండి సంజయే వెల్లడించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో అందరికంటే కూడా తననే అత్యధికంగా టార్గెట్ చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటమే కారణమనీ ఆయన చెప్పుకొచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే సిట్ విచారణకు వచ్చే ముందు బండి సంజయ్ రెండు బండిళ్ల నిండా ఆధారాలను తీసుకుని వచ్చారు. ఆ బండిళ్లపై ‘కాన్ఫిడెన్షియల్’ అని రాసి ఉంది. అంటే అందులోని సమాచారం అత్యంత కీలకమైనదేనన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం బండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హోదాలో టెలికాం శాఖను సంప్రదించిన ఆయన తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సమగ్ర ఆధారాలను సేకరించినట్లుగా సమాచారం. అదే సమాచారాన్ని ఆయన సిట్ కు ఇప్పటికే సమర్పించారు. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినది కావడంతో దీనిపై సిట్ ప్రత్యేక దృష్టి సారించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా సాక్షుల హోదాలో సిట్ విచారణకు హాజరైన వారు ఇలా పక్కా ఆధారాలతో కూడిన సమాచారాన్ని సిట్ కు అందించిన దాఖలా లేదు. దీంతో బండి ఇచ్చిన సమాచారంపై మాత్రం సిట్ ప్రత్యేక దృష్టి సారించక తప్పదు. అదే సమయంలో ట్యాపింగ్ కేసులో సిట్ టైం పాస్ చేస్తోందని ఆరోపిస్తున్న బండి, ఇతర బీజేపీ నేతలు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన సిట్ పై భారీ ఒత్తిడి అయితే పెరిగిపోయినట్టే. వెరసి కేసు దర్యాప్తు సరైన ట్రాక్ లోకి రాక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

This post was last modified on August 10, 2025 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago