పార్టీని నడిపించేందుకే కాదు.. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా సలహాలు కావాలి. కేవలం ప్రజల్లో ఏర్పడే సానుభూతిని నమ్ముకుని.. ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు, పార్టీలకు కూడా లేదు. ఎందుకంటే.. ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో పట్టుకోవడం.. అంత ఈజీ కాదు. ఇప్పుడున్నట్టుగా.. వచ్చే రెండేళ్ల తర్వాత రాజకీయాలు ఉండవు. ప్రజల మూడ్ కూడా ఉండదు. నిన్న మొన్నటి వరకు వైసీపీ మాత్రమే.. సంక్షేమం అమలు చేసిందన్న ప్రచారం చేసుకున్నారు. దీనికి తామే పేటెంట్ పొందామన్నారు.
కానీ, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు.. దాదాపు 45 శాతం మంది లబ్ధిదారుల్లో సంతోషాన్ని నింపుతు న్నాయి. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. పైగా ఇప్పటి వరకు కొన్ని పథకాలు చేరువ కానీ.. కొంత అసంతృప్తితో ఉన్న వారిని కూడా మచ్చిక చేసుకునేందుకు.. వారిలో ఆనందం నింపేందుకు.. కూటమి సర్కారు ఈ నెల 15 నుంచి.. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని చేరువ చేస్తోంది. దీనికి ఉన్న అన్ని నిబం ధనలను దాదాపు తొలగించింది. ఫలితంగా.. ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. దీనిలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.
తద్వారా.. ఇప్పటి వరకు ఇతర పథకాల్లో ఉన్న లోపాలను ఈ ఫ్రీ బస్సు సర్వీసు పూర్తిగా తుడిచేయనుం ది. ఇది సర్కారుకు చాలా వరకు మేలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. వచ్చే మూడు సంవ త్సరాల పాటు కూడా.. దీనిని అమలు చేస్తారుకాబట్టి.. ఇతర పథకాలు ఎలా ఉన్నా.. ఇంటి బయటకు రాగానే ఉచితంగా బస్సు కనిపిస్తే.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇది.. ప్రత్యక్షంగా కూటమికి మేలు చేసే ప్రక్రియ. ఇక, వైసీపీ పరంగా చూస్తే.. పార్టీలో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాము.. ముందు నుంచి విమర్శలు చేయకుండా ఉంటే.. బాగుండేదని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.
అంటే.. గత మూడు మాసాల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో.. ఉచిత బస్సుపై వ్యతిరేక ప్రచారం చేశా రు. ఉచితం అంటే.. కేవలం మండలాలకేనని, జిల్లాలకేనని.. కానీ, ఎన్నికలకు ముందు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉచితమని హామీ ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ వ్యతిరేక ప్రచారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ చేసింది. తద్వారా.. వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చి నట్టు అయింది. అంతేకాదు.. వైసీపీ అవాక్కయ్యేలా చేసింది.
ఇక, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ చేయడం వెనుక కూడా కీలక రీజన్ ఉంది. ఇప్పటి వరకు ఇతర పథ కాల్లో లబ్ధి పొందని వారు, మధ్యతరగతి వారుకూడా కూటమి సర్కారుకు సానుకూలంగా మారే అవకాశం ఉంటుందన్న అంచనాలు వున్నాయి. ఇక, ఇతర పథకాలకు ఏటా ఎంత లేదన్నా.. 10 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలి. కానీ, ఫ్రీ బస్సులో అయితే.. కేవలం 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందరినీ ఆనందంగా ఉంచొచ్చు. అందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు వైసీపీకి బ్రేకులు వేశారన్న టాక్ వినిపిస్తోంది.
This post was last modified on August 10, 2025 8:50 am
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు అతడికి…
యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా చిన్న వయసులోనే మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణవి అనే తెలంగాణ అమ్మాయి ఈ ఏడాది…
అల్లు అర్జున్ ఒక కొత్త సినిమా మొదలుపెట్టాడు అంటే ప్రమోషన్ల పరంగా మొదట్నుంచి బాగా హడావుడి ఉంటుంది. రెగ్యులర్గా అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల కాళీకృష్ణ…
అమెరికా ఎఫ్బీఐ పేరుతో సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఎక్స్ కు అభ్యర్థనలు పంపారని ఏపీ పోలీసులపై, ఎన్డీఏ ప్రభుత్వంపై…
వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…