Political News

జగన్, కేటీఆర్‌లకు ‘రాఖీ’ మిస్ చేసిన రాజకీయం

దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలలోని రెండు హై ప్రొఫైల్ కుటుంబాలలో మాత్రం రాఖీ పండుగ సందడి కనిపించడం లేదు. రాజకీయ వైరంతో ఒకరు… రాజకీయంగా అంతర్గత విభేదాలతో మరొకరు రాఖీ పండుగ జరుపుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల రాఖీ కట్టకపోవడం… కవిత రాఖీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నా కేటీఆర్ అందుబాటులో లేకపోవడం హాట్ టాపిక్‌గా మారాయి.

కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలలో కవిత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పార్టీకి, కవితకు వచ్చిన గ్యాప్‌, కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ లీక్ కావడం నేపథ్యంలో కేటీఆర్‌, కవితల మధ్య గ్యాప్ వచ్చింది. అవన్నీ పక్కనబెట్టి అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టేందుకు కవిత సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే, నిన్న లగచర్లకు చెందిన అక్కచెల్లెమ్మలతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్… అటు నుంచి అటే బెంగళూరు వెళ్లారు. నిన్నే తాను రాఖీ కట్టేందుకు ఇంటికి వస్తానని కేటీఆర్‌కు కవిత నిన్న ఉదయం మెసేజ్ చేశారట.

అయితే, ఆయన బెంగుళూరు వెళ్లిన తర్వాత తాను ఊళ్లో లేనని రిప్లై ఇచ్చారట. దీంతో, రాఖీ పండుగ రోజు కవిత తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. రాజకీయపరంగా అభిప్రాయభేదాలు, విభేదాలు, మనస్పర్థలు ఉన్నప్పటికీ అన్న కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టేందుకు ముందుకు వచ్చినా, ఆయన పెద్దగా సుముఖత చూపకపోవడంతో ఆమె బాగా హర్ట్ అయ్యారట. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ నాడు కూడా కలవకపోవడంపై కవిత బాధపడుతున్నారట.

మరోపక్క, ఏపీలో వైసీపీ నేతలపై, అన్న జగన్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్న షర్మిల… కనీసం రాఖీ పండుగ నాడు కూడా అన్నకు రాఖీ కట్టేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది.

This post was last modified on August 9, 2025 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

2 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

2 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

3 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

4 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

5 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

5 hours ago