రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. అయితే.. ఈ సెంటిమెంటు వ్యవహారం ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నేతకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మరో అడుగు ముందుకు వేశారు. శనివారం రాఖీ పండుగను పురస్కరించుకుని ఆయన మంగళగిరి కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు వెంట ఆయన కూడా.. మన్యం జిల్లాకు వెళ్లి.. జన జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాలు పంచుకోవాల్సి ఉంది.
కానీ, రాఖీ పండుగతో నారా లోకేష్.. మంగళగిరి కార్యాలయంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నుంచి వచ్చిన మహిళలతో ఆయన రాఖీ కట్టుకున్నారు. అనంతరం వారికి మంగళగిరి చేనేత చీరలను కానుకగా అందించారు. అయితే.. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనకు తోబుట్టువులంటూ.. ఎవరూ లేరని.. తాను ఒక్కడినేనని, కానీ, గత ఎన్నికల్లో తనను మనసులో పెట్టుకుని దీవించి అఖండ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి మహిళలందరూ తనకు అక్కా చెల్లెళ్లతో సమానమని వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క వ్యాఖ్య.. మంగళగిరి మహిళల మనసు దోచుకునేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత.. మరింత మంది మహిళలు పార్టీ కార్యాలయానికి చేరుకుని నారా లోకేష్కు రాఖీ కట్టేందుకు క్యూలో నిలబడ్డారు. వాస్తవానికి.. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన ఎప్పుడూ.. ఇంతగా ఇక్కడివారిని ఓన్ చేసుకోలేకపోయారు. ఎమ్మెల్యే అంటే.. ఎమ్మెల్యేగా మాత్రమే వ్యవహరించారు. దీనికి భిన్నంగా నారా లోకేష్ మంగళగిరి ప్రజలను ఓన్ చేసుకోవడం.. ఇక్కడి మహిళలను తన సొంత తోబుట్టువులుగా పేర్కొనడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on August 9, 2025 5:18 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…