Political News

ఆ ఒక్క మాటతో మంగ‌ళ‌గిరి మ‌న‌సు దోచేసిన లోకేష్‌!

రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. అయితే.. ఈ సెంటిమెంటు వ్య‌వ‌హారం ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నేత‌కు ఒక్కొక్క ర‌కంగా ఉంటుంది. ఈ విష‌యంలో టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. మ‌రో అడుగు ముందుకు వేశారు. శ‌నివారం రాఖీ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఆయ‌న మంగ‌ళ‌గిరి కార్యాల‌యంలోనే అందుబాటులో ఉన్నారు. వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబు వెంట ఆయ‌న కూడా.. మ‌న్యం జిల్లాకు వెళ్లి.. జ‌న జాతీయ ఆదివాసీ దినోత్స‌వంలో పాలు పంచుకోవాల్సి ఉంది.

కానీ, రాఖీ పండుగ‌తో నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి కార్యాల‌యంలోనే ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరి నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌తో ఆయ‌న రాఖీ క‌ట్టుకున్నారు. అనంత‌రం వారికి మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ల‌ను కానుక‌గా అందించారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. తన‌కు తోబుట్టువులంటూ.. ఎవ‌రూ లేర‌ని.. తాను ఒక్క‌డినేనని, కానీ, గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను మ‌న‌సులో పెట్టుకుని దీవించి అఖండ మెజారిటీతో గెలిపించిన మంగ‌ళ‌గిరి మ‌హిళలంద‌రూ త‌న‌కు అక్కా చెల్లెళ్ల‌తో స‌మాన‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఈ ఒక్క వ్యాఖ్య‌.. మంగ‌ళ‌గిరి మ‌హిళ‌ల మ‌న‌సు దోచుకునేలా చేసింది. సోష‌ల్ మీడియాలో ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయిన త‌ర్వాత.. మ‌రింత మంది మ‌హిళ‌లు పార్టీ కార్యాల‌యానికి చేరుకుని నారా లోకేష్‌కు రాఖీ క‌ట్టేందుకు క్యూలో నిల‌బ‌డ్డారు. వాస్త‌వానికి.. గ‌తంలో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న ఎప్పుడూ.. ఇంతగా ఇక్క‌డివారిని ఓన్ చేసుకోలేకపోయారు. ఎమ్మెల్యే అంటే.. ఎమ్మెల్యేగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించారు. దీనికి భిన్నంగా నారా లోకేష్ మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల‌ను ఓన్ చేసుకోవ‌డం.. ఇక్క‌డి మ‌హిళ‌ల‌ను త‌న సొంత తోబుట్టువులుగా పేర్కొన‌డంతో మహిళ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on August 9, 2025 5:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

12 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

43 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago