గిరిజనులు, ఆదివాసీలను వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చిందని.. వారిని ఓటు బ్యాంకుగానే చూసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. శనివారం.. జన జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో ఆయన ముచ్చటించారు. తొలుత గిరిజనుల సంప్రదాయ నృత్యాలను తిలకించారు. కొమ్ములతో చేసిన తలపాగాను ధరించారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆదివాసీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గిరిజనులు అంటే.. ఊరికి దూరంగా ఉంటారని.. కానీ, వారి మనసులు మాత్రం ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటాయన్నారు. గిరిజనుల సంపద పెంచేందుకు తమ ప్రభుత్వం గిరిజన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల ఆదాయం పెంచితే.. అది వారిని సామాజికంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు.
గిరిజనులకు ఉన్న ప్రత్యేక చట్టాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. వారిని ఓటు బ్యాంకుగానే చూశారని, వారిని కూడా తమ రాజకీయం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులను ప్రోత్సహించి కొందరు వైసీపీ నాయకులు గంజాయి సాగును ఒక కుటీర పరిశ్రమను చేశారని.. కేసులు ఎదుర్కొనే సమయానికి గిరిజనులను ఇరికించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవ్వరూ గంజాయి జోలికి పోకుండా.. అనేక పంటలు పండించేలా ప్రభుత్వం మార్గదర్శనం చేస్తోందని చంద్రబాబు చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా.. రహదారుల నిర్మాణం చేపడుతున్నామని.. భవిష్యత్తులో గిరిజనులకు.. బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గిరిజనుల ఉత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువస్తున్నామని.. దీనికి అరకు కాఫీనే ఉదాహరణని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తీసే తేనెకు కూడా ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు.
This post was last modified on August 9, 2025 5:09 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…