గిరిజనులు, ఆదివాసీలను వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చిందని.. వారిని ఓటు బ్యాంకుగానే చూసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. శనివారం.. జన జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో ఆయన ముచ్చటించారు. తొలుత గిరిజనుల సంప్రదాయ నృత్యాలను తిలకించారు. కొమ్ములతో చేసిన తలపాగాను ధరించారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆదివాసీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గిరిజనులు అంటే.. ఊరికి దూరంగా ఉంటారని.. కానీ, వారి మనసులు మాత్రం ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటాయన్నారు. గిరిజనుల సంపద పెంచేందుకు తమ ప్రభుత్వం గిరిజన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల ఆదాయం పెంచితే.. అది వారిని సామాజికంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు.
గిరిజనులకు ఉన్న ప్రత్యేక చట్టాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. వారిని ఓటు బ్యాంకుగానే చూశారని, వారిని కూడా తమ రాజకీయం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులను ప్రోత్సహించి కొందరు వైసీపీ నాయకులు గంజాయి సాగును ఒక కుటీర పరిశ్రమను చేశారని.. కేసులు ఎదుర్కొనే సమయానికి గిరిజనులను ఇరికించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవ్వరూ గంజాయి జోలికి పోకుండా.. అనేక పంటలు పండించేలా ప్రభుత్వం మార్గదర్శనం చేస్తోందని చంద్రబాబు చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా.. రహదారుల నిర్మాణం చేపడుతున్నామని.. భవిష్యత్తులో గిరిజనులకు.. బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గిరిజనుల ఉత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువస్తున్నామని.. దీనికి అరకు కాఫీనే ఉదాహరణని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తీసే తేనెకు కూడా ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు.
This post was last modified on August 9, 2025 5:09 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…