Political News

రెండు రాష్ట్రాల్లో.. రాజ‌కీయ రాఖీలు.. !

రాఖీ పండుగ అంటే.. అన్న‌, త‌మ్ముళ్ల మేలు కోరి.. మ‌హిళ‌లు క‌ట్టే రాఖీ అన్న విష‌యం తెలిసిందే. ఇక‌, త‌మ తోబుట్టువు మేలు కోరి.. అన్న‌ద‌మ్ములు కూడా.. కానుక‌లు ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ద‌క్షిణాదిలో ఈ పండుగ జోరుగా సాగుతోంది. అయితే.. సాధార‌ణ రాఖీ పండుగ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ రాఖీ పండుగ మాత్రం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఇరుగు పొరుగు పార్టీల‌కు చెందిన నాయ‌కులు అధికార పార్టీకి రాఖీ క‌డుతున్నార‌న్న మాట‌.!

ఈ విష‌యంలో తెలంగాణ‌లో జోరు మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక్క‌డ అధికారంలో ఉన్న పార్టీతో పాటు.. మ‌రో ప్ర‌తిప‌క్షం బీజేపీకి కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నుంచి వ‌స్తున్న జంపింగులు రాఖీలు క‌డుతున్నారు. మీతోనే మేం ఉంటాం.. మీరు పెట్టిందే తింటాం!.. అంటూ నాయ‌కులు సెల‌విస్తున్నారు. మ‌రోవైపు.. ఉన్న నేత‌లు పోతుండ‌డంతో బీఆర్ ఎస్ పార్టీకి ఏం చేయాలో తెలియ‌డం లేదు. అరిచి గోల చేస్తే.. పార్టీ వీక్ అవుతోంద‌న్న ప్ర‌చారం తామే చేసుకున్న‌ట్టుగా అవుతుంద‌న్న ఆవేద‌న ఉంది.

అలాగ‌ని సైలెంట్‌గా ఉంటే.. నాయ‌కులు లెక్క‌కు మిక్కిలి కారు దిగేస్తున్నారు. ఇదిలావుంటే.. అధికారంలో ఉన్న త‌మ వైపు రాకుండా.. కొంద‌రు నాయ‌కులు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీవైపు ప‌రుగులు పెడుతుండ‌డాన్ని కాంగ్రెస్ నాయ‌కులు కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి జంపింగులు జోరుగా సాగాయి. అయితే.. జంపింగుల రూపంలో కోవ‌ర్టులు క్యూ క‌డుతుండ‌డంతో కూట‌మి అలెర్ట్ అయింది.

ఎవ‌రిని చేర్చుకున్నా.. పార్టీల్లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. ఆ త‌ర్వాత పూర్తిగా నిలువ‌రించారు. ప్ర‌స్తుతం వైసీపీ నుంచి న‌లుగురు సీనియ‌ర్ నేత‌లు, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నార‌ని.. కూట‌మి గేట్లెక్కేస్తే.. వ‌చ్చి రాఖీలు క‌ట్టేసేందుకు రెడీగా ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ, ఇప్పుడున్న నాయ‌కులు చాల‌నుకుంటున్న పార్టీలు.. కొత్త‌వారితో రాఖీలు క‌ట్టించుకునేందుకు ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి రాజ‌కీయ రాఖీల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింద‌నే చెప్పాలి.

Kumar

Recent Posts

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత…

52 minutes ago

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…

2 hours ago

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

7 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

9 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

12 hours ago

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…

12 hours ago