Political News

కేసీఆర్, కేటీఆర్, సంతోష్ ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదు

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త నిజం బయటకు వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించగా.. ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత విస్తృతంగా జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని నేతలపైనా నిఘా పెట్టేందుకు కూడా పార్టీ అధిష్ఠానం ఫోన్ ట్యాపింగ్ నే వినియోగించిందని శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కు గురైన బీఆర్ఎస్ బాధితుల్లో కేసీఆర్ కుమార్తె కవిత సహా ఆమె భర్త అనిల్, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావూ ఉన్నారట. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుల ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదని, ఇక అందరి ఫోన్లూ ట్యాప్ అయ్యాయంటూ ఆయన ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరైన బండి సంజయ్… విచారణలో భాగంగా సిట్ అధికారులకు కీలక ఆధారాలు అందజేశారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు సిట్ నేతృత్వంలో సరిగా సాగడం లేదని, సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఫోన్ ట్యాపింగ్ కు ఎవరెవరు గురయ్యారన్న వివరాలను కూడా ఆయన వెల్లడించి కలకలం రేపారు. కేసీఆర్ తన కన్నబిడ్డ కవిత ఫోన్ నే ట్యాప్ చేయించారని ఆరోపించిన బండి… కవిత భర్త అనిల్ ఫోన్ నూ వదలలేదని తెలిపారు. ఇక పార్టీతో పాటు కేసీఆర్ కు ఆది నుంచి వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న ఆయన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు ఫోన్ నూ ట్యాప్ చేయించారంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ లెక్కన విపక్షాలకు చెందిన బడా, చోటా నేతలతో పాటుగా సొంత పార్టీకి చెందిన కీలక నేతల నుంచి కింది స్థాయి నేతల దాకా బీఆర్ఎస్ అధిష్ఠానం నిఘా పెట్టిందని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక అందరికంటే కూడా తన ఫోన్ నే అత్యదిక సార్లు ట్యాప్ చేశారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ ఉచ్చులో చిక్కిన ప్రతి నేత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇంతటి దారుణమైన నేరాలతో కూడిన కేసును సిట్ తో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే… బండి సంజయ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలుసుకున్న బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలని సంబంధిత అదికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

This post was last modified on August 8, 2025 8:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago