Political News

అమరావతికి గెజిట్… బాబుకు ఇదో సంకటం!

అమరావతి… నవ్యాంధ్ర రాజధాని. అయితే, దీనిని సుస్థిరంగా ఉంచాలన్నది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆలోచన. దీనికిగాను కేంద్రంతో ఒప్పించి, మెప్పించి గెజిట్ జారీ చేయించాలనీ, తద్వారా ఎవరు వచ్చినా అమరావతి జోలికి పోకుండా రాజధానిని కదపకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కోరుతున్నారు. కొన్నాళ్ల క్రితం మరిన్ని భూములు కావాలంటూ ప్రభుత్వం ప్రతిపాదన చేసిన సమయంలో రైతులు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.

వాస్తవానికి విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒక రాజధాని ఉండాలి. ఇదే గతంలో మూడు రాజధానులను వ్యతిరేకించి అమరావతిని నిలబెట్టుకునే క్రమంలో పనిచేసిన మంత్రం. అయితే, ఆ ఒక రాజధానిని సుస్థిరం చేసుకోవాలన్నది రైతులు చెబుతున్న మాట. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మళ్లీ కూటమి రావాలని కోరుకునే వారు ఉన్నా, వైసీపీ ప్రయత్నాలు వైసీపీ చేస్తోంది. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలన్నది ఇక్కడి రైతులు కోరుతున్నారు.

ఈ క్రమంలో కీలకమైన గెజిట్‌ను జారీ చేయించడం ద్వారా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి, కేంద్ర జాబితాలో చేర్చడం ద్వారా అమరావతికి శాశ్వత ముద్ర వేయాలని కోరుతున్నారు. అయితే, ఇది అంత తేలికేనా అనేది ప్రశ్న. ఈ విషయంలో కేంద్రం పూనిక వహిస్తే తప్ప సాధ్యం కాదు. దీనికి కేంద్రం సిద్ధపడాల్సి ఉంది. రాష్ట్రం కూడా ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక్కసారి గెజిట్ వస్తే ఇక రాజధాని ప్రాంతాన్ని విస్తరించేందుకు అవకాశం ఉండదన్నది అధికారులు చెబుతున్న మాట.

కానీ, ప్రస్తుతం రాజధానిని మరో 44 వేల ఎకరాలకు విస్తరించి, మొత్తం 77 వేల ఎకరాల విస్తీర్ణంలో అమరావతిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపోస్తున్నారు. ఇదే గెజిట్ కోసం ప్రయత్నించడంలో ఇబ్బందులు తెస్తోంది. ముందు భూసమీકરણ పూర్తి చేసుకుంటే, తర్వాత గెజిట్ తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 33 వేల ఎకరాలకే అమరావతి పరిమితమైంది. మరో 44 వేల ఎకరాల సేకరణ ఒకరకంగా ఇబ్బందిగానే ఉంది. దీనిని త్వరగా పూర్తి చేసి, ప్రజాభిప్రాయం సేకరించి, అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపితే అప్పుడు గెజిట్ పూర్తవుతుంది. దీనికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

42 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago