మాజీ ఉప రాష్ట్రపతి.. వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బూతులు మాట్లాడిన బూతు నేతలు.. గుండుగుత్తగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇక, వారు మళ్లీ గెలుస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. బూతులు మాట్లాడేవారిని పోలింగ్ బూత్ల ద్వారా ప్రజలే నిలువరిస్తున్నారని చెప్పారు. తాజాగా హైదరాబాద్లో ‘విలీనం-విభజన’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాల్లో ఉన్నవారు విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఇప్పుడున్నవారిలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. పోనీ.. కనీసం నోరైనా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వాగ్బూషణం-భూషణం.. అన్నట్టుగా.. మాట్లాడే ప్రతిమాటను తూకం వేసి మాట్లాడడం నేర్చుకోండి. బూతులు మాట్లాడడం.. ద్వంద్వార్థ పదాలు మాట్లాడడం.. ఇప్పుడు నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. అవి రాజకీయాల్లో మంచి చేయవు. ప్రజలు బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ల ద్వారా బుద్ధి చెబుతారు.” అని వ్యాఖ్యానించారు.
తాను నెల్లూరుకు వెళ్లినప్పుడు.. కొందరు మహిళలు తన ఇంటికి వచ్చారని.. వారంతా బూతులు మాట్లాడే నాయకులపై ఫిర్యాదులు చేశారని.. కానీ, తాను ఏమీ చేయలేనని.. మీ చేతిలోనే బూత్లు ఉన్నాయని వాటి ద్వారానే వారికి సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేసినట్టు వెంకయ్య తెలిపారు. ఇలా పరోక్షంగా అప్పటివైసీపీ నాయకులపై వెంకయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మీడియా పాత్ర కీలకమన్న ఆయన.. మంచి చెడులను ప్రజలకు వివరించే గురుతర బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
This post was last modified on August 5, 2025 3:33 pm
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…