Political News

వైసీపీ ప్రచారం పై బాబు నివేదిక ఏమంటుందంటే

“ఔను.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ దాదాపు 99 శాతం మందికి అందింది” అని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు నివేదికలు పంపారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం, ఈ పథకం అమలైన తర్వాత 48 గంటల్లో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌లకు సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో అధికారులు జిల్లాల స్థాయిలో రిపోర్టులను పరిశీలించి, నివేదికను సీఎం కార్యాలయానికి పంపించారు.

ఎందుకు?

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ యోజనలను కలిపి, ఏపీ ప్రభుత్వం 46 లక్షల మందికి పైగా రైతులకు సోమవారం నిధులు జమ చేసింది. ఒక్కొక్క రైతుకు రూ.5000 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కేంద్రం ఇచ్చిన రూ.2000 కలిపి మొత్తం రూ.7000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

అయితే దీనిపై వైసీపీ సహా కమ్యూనిస్టు పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. రైతులకు రూ.20 వేలు ఇస్తామన్నట్టు చెప్పి చివరికి కేవలం రూ.5000 ఇచ్చారని, చాలా మందికి నిధులు అందలేదని విమర్శలు గుప్పించారు. రైతులు సంతోషంగా లేరని వైసీపీ అధినేత జగన్ అదే రోజు 14 ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్‌లో టార్గెట్ చేశారు. తాము ఉన్నప్పుడు రైతులకు మేలు జరిగిందని, ఇప్పుడు వారిపై దగా చేస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. నిజంగానే రైతుల్లో హర్షం ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత కోసం కలెక్టర్లతో చర్చించి వెంటనే నివేదికలు పంపాలన్నారు.

తాజాగా సీఎం డ్యాష్‌బోర్డుకు కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, అన్ని జిల్లాల్లో దాదాపు 99 శాతం మంది రైతులకు నిధులు అందాయని, ఉప ఎన్నికలు జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. నిధులు సమయానికి వచ్చాయని రైతులు సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం చేశారు.

This post was last modified on August 4, 2025 11:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

15 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

30 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago