వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని ఇప్పుడప్పుడే కేసులు వదిలేలా లేవు. ఇప్పటికే నాని ప్రాతినిధ్యం వహించిన గుడివాడ కేంద్రంగా పలు కేసులు నమోదు కాగా…గుండె సంబంధిత వ్యాధి, దానికి చికిత్స, ముంబైలో ఆపరేషన్ తదితర కారణాలతో జైలు నుంచి తప్పించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా నానిపై మరో కేసు నమోదు అయ్యింది. అది కూడా విశాఖపట్నంలో నమోదు కావడం గమనార్హం.
విశాఖలో నమోదు అయిన ఈ తాజా కేసు విషయానికి వస్తే… వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై నాని నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాలిటిక్స్ లో సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబుపై, ఆయన కుమారుడిపై నాని పరుష పదజాలంతో విరుచుకుపడటాన్ని భరించలేని న్యాయ విద్యార్థి అంజనప్రియ విశాఖ త్రీటౌన్ పీఎస్ లో 2024లోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నానిపై నాడే ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసు బూజు దులిపిన విశాఖ పోలీసులు ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని నాని ఇంటికి వచ్చారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ నానికి వారు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద ఇచ్చిన ఈ నోటీసుల ఆధారంగా నాని తప్పనిసరిగా విశాఖ త్రీటౌన్ పీఎస్ కు వెళ్లి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకున్న అనారోగ్య సమస్యను సాకుగా చూపి ఆయన మరోమారు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనను కేసులు మాత్రం వీడేలా లేవని మాత్రం చెప్పక తప్పదు.
This post was last modified on August 3, 2025 11:04 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…