Political News

ఆటో మ్యుటేషన్ తో అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్

ఏపీలో ఏదైనా స్థలం లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక యుద్ధం చేసినట్లే. రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాయడం…గంటల కొద్దీ జనం వేచి ఉండడం సర్వసాధారణం. అయితే, ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పాస్ పోర్టు దరఖాస్తుకు స్లాట్ బుకింగ్ తరహాలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూ స్లాట్ బుకింగ్ విధానం కొద్ది రోజుల క్రితం అమలులోకి తెచ్చారు. దీంతో, చంద్రబాబు పాలనపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దాంతోపాటు, తాజాగా రిజిస్ట్రేషన్ ప్రహసనం పూర్తయిన తర్వాత మ్యుటేషన్ ప్రక్రియలో జరిగే జాప్యం నివారించడానికి కూడా చంద్రబాబు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటో మ్యుటేషన్ జరిగే విధానానికి చంద్రబాబు సర్కార్ నాంది పలికింది. నేటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

గతంలో అయితే, ప్రాపర్టీ కొన్నామన్న సంతోషం కూడా జనానికి ఉండేది కాదు. అమ్మిన వారి పేరు బదులు కొన్న వారి పేరు మ్యుటేషన్ కావడానికి వీఆర్వో, సంబంధిత ఉద్యోగుల చుట్టూ జనం తిరగాల్సి వచ్చేది. ఆస్తి పన్ను కట్టాలంటే పేరు మార్పు కాకకపోవడం అడ్డంకిగా మారింది. దానికి తోడు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ కష్టాలకు చెక్ పడినట్లయింది. అయితే, రిజిస్ట్రేషన్ సమయానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన పన్ను చెల్లించాల్సి ఉంటే మాత్రం మ్యుటేషన్ చార్జీలతో పాటు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఆటో మ్యుటేషన్ జరగడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్ లకు కూడా అడ్డుకట్ట వేసినట్లే.

Kumar

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

1 hour ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago