Political News

ఇకపై తిరుమలలో రీల్స్ చేస్తే…

దేశంలోని హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని మీరి హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లు చాలామందే ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో పరిమితులు తెలియకుండా ప్రవర్తించే వాళ్లకు కొదవే లేదు. రీల్స్‌, షార్ట్స్ ద్వారా పాపులర్ కావడం కోసం తిరుమల ఆలయం ముందు.. మాడ వీధుల్లో వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 

రోజు రోజుకూ ఈ వేషాలు శ్రుతి మించుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో ఇకపై ఎవరైనా రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ‘‘ఇలాంటి చర్యలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది.. ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతాం’’ అని టీటీడీపీ ఓ ప్రకటనలో తీవ్రంగానే హెచ్చరించింది.

రీల్స్, షార్ట్స్ పిచ్చితో జనం విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారన్నది స్పష్టం. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా.. ప్రతిదీ వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తిరుమలకు వచ్చామని చెప్పడానికి ఫొటోలు, వీడియోలు తీయడం వరకు ఓకే కానీ.. డ్యాన్సులు చేయడం, శ్రుతి మించి ప్రవర్తించడమే టీటీడీ హెచ్చరికలకు కారణం.

Kumar

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago