దేశంలోని హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటిని మీరి హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లు చాలామందే ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా కాలంలో పరిమితులు తెలియకుండా ప్రవర్తించే వాళ్లకు కొదవే లేదు. రీల్స్, షార్ట్స్ ద్వారా పాపులర్ కావడం కోసం తిరుమల ఆలయం ముందు.. మాడ వీధుల్లో వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.
రోజు రోజుకూ ఈ వేషాలు శ్రుతి మించుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో ఇకపై ఎవరైనా రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ‘‘ఇలాంటి చర్యలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది.. ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతాం’’ అని టీటీడీపీ ఓ ప్రకటనలో తీవ్రంగానే హెచ్చరించింది.
రీల్స్, షార్ట్స్ పిచ్చితో జనం విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారన్నది స్పష్టం. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా.. ప్రతిదీ వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తిరుమలకు వచ్చామని చెప్పడానికి ఫొటోలు, వీడియోలు తీయడం వరకు ఓకే కానీ.. డ్యాన్సులు చేయడం, శ్రుతి మించి ప్రవర్తించడమే టీటీడీ హెచ్చరికలకు కారణం.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…